'జత కలిసే' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Saturday,December 19 2015]

అశ్విన్, తేజస్వి హీరో హీరోయిన్లుగా ఓంకార్ సమర్పణలో యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మించిన‌ చిత్రం జత కలిసే'. అలామొదలైంది' ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'రేపటి దర్శకులు' అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంద‌ని, ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాలకు భిన్నంగా మంచి ఎంట‌ర్‌టైనింగ్‌తో సినిమా ఉంద‌ని సెన్సార్ స‌భ్యులు నిర్మాత‌ల‌కు తెలియ‌జేశారు. ఈ సినిమాను చూసిన వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటిగారు మా సినిమాను డిసెంబ‌ర్ 25న గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. సాయి కొర్ర‌పాటిగారు సినిమాను విడుదల చేస్తుండటంతో సినిమా రేంజ్ పెరిగింది.

పృథ్వీ, షకలక శంకర్, ధనరాజ్, జబర్ దస్త్' రాంప్రసాద్, సూర్య, ప్రియ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా మరి కొంత మంది నూతన నటీనటులు, టెక్నిషియన్స్ కూడా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: అనంత్ శ్రీరామ్, రెహమాన్, డ్యాన్స్: శేఖర్, గణేష్, విజయ్, ఫైట్స్: జాషువ, ఆర్ట్: జె.కె.మూర్తి, పిఆర్ఓ: వంశి- శేఖర్, పబ్లిసిటీ డిజైన్స్: కృష్ణ ప్రసాద్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, కెమెరా: జగదీష్ చీకటి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: వైది, సంగీతం: విక్కి, నిర్మాత: నరేష్ రావూరి, రచన-దర్శకత్వం: రాకేష్ శశి.

More News

'మామ మంచు.. .అల్లుడు కంచు' సెన్సార్ పూర్తి

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రమ్యక ష్ణ, మీనా, అల్లరి నరేష్, పూర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'మామ మంచు.. అల్లుడు కంచు డా.మోహన్బాబు, రమ్యక ష్ణ, మీనా కాంబినేషన్లో 23 ఏళ్ళ క్రితం మోహన్బాబు...

భలే మంచిరోజు సినిమాలో నటించడం ఓ అందమైన అనుభూతి - పరుచూరి గోపాలక్రిష్ణ

సుధీర్ బాబు హీరోగా నూతన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం భలే మంచిరోజు. 70 ఎం.ఎం ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ రెడ్డి, శశిధర రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

చిరంజీవి, నాగబాబు గర్వపడేలా వరుణ్ తేజ్ సినిమాలు చేస్తాడు - పూరి జగన్నాథ్

'ముకుంద', 'కంచె' వంటి విభిన్న కథా చిత్రాల్లో హీరోగా నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న మెగాబ్రదర్ నాగబాబు తనయుడు సుప్రీమ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్ సి.కళ్యాణ్ సమర్పణలో

మారుతి చేతుల మీదుగా 'వినోదం 100%' ట్రైలర్‌ విడుదల

ఎస్‌.ఎస్‌. సెల్యులాయిడ్స్‌ పతాకంపై జైశ్రీరామ్‌ దర్శకత్వంలో విజయ్‌భరత్‌, అశ్విని, కాంచనలు హీరో హీరోయిన్‌లుగా పొట్నూరు శ్రీనివాసరావు నిర్మిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'వినోదం%'.

శంక‌ర్‌కు త‌ల‌నొప్పులు స్టార్ట‌య్యాయి

సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 2.0. సీక్వెల్ ఆఫ్ రోబో ట్యాగ్ లైన్‌. ఈ సినిమా డిసెంబ‌ర్ 16న చెన్నైలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.