‘జాతిరత్నాలు’: లైఫ్‌ అండ్‌ డెత్‌ సమస్యకు కామెడీని మిక్స్ చేశారు

  • IndiaGlitz, [Friday,February 12 2021]

న‌వీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం 'జాతిర‌త్నాలు'. ఈ సినిమాలో ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించింది. అనుదీప్ కె.వి దర్శకత్వంలో ఈ సినిమా కామెడీ క్యాప‌ర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలకు సంకెళ్లు వేసి తీసుకెళుతున్న సీన్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది.

ప్రియదర్శికి వచ్చేసి ఖైదీ నంబర్ 210 .. నవీన్‌కు 420 అని.. రాహుల్ రామకృష్ణకు 840 నంబర్లను కేటాయించారు. సెల్‌లో ఉన్నప్పుడూ నవ్వులు పూయించడమే కాకుండా బయట కూడా ఈ ముగ్గురు బాగా నవ్వించారు. రూ. 500 కోట్ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని టీజర్‌ని బట్టి తెలుస్తోంది. న‌వీన్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంద‌నే సంగతి ఈ టీజ‌ర్‌లో చూడొచ్చు. హీరోయిన్‌ను కూడా చాలా గ్లామర్‌గా చూపించారు. రాథన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్దం మ‌నోహ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ ఇంప్రెసివ్‌గా ఉన్నాయి.

ముగ్గురు యువకుల జీవితంలో ‘లైఫ్‌ అండ్‌ డెత్‌’ పరిస్థితి ఏర్పడటానికి కారణం ఏంటి? దాన్ని వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు? చివరకు ఆ సమస్య నుంచి బయట పడ్డారా? లేదా? వంటి ఆసక్తికర విషయాలకు కామెడీని జోడించి అద్భుతమైన సినిమాగా మలిచి అనుదీప్ ప్రేక్షకులకు అందించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More News

ఇల్లందు జేకే మైన్స్‌ను సందర్శించిన కొరటాల.. 7 నుంచి షూటింగ్

సక్సెస్‌ఫుల్ దర్శకుడు కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ‘ఆచార్య’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

టీటీడీని ధారాదత్తం చేసేందుకు కుట్ర: చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం విషయమై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడంటే?

మంచు వారబ్బాయి త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. మంచు మోహన్‌బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

నోటికి పనిచెప్పిన కొడాలి నాని.. షాకిచ్చిన ఎస్‌ఈసీ

మంత్రి కొడాలి నాని మరోసారి నోటికి పని చెప్పారు. ఎన్నికల కమిషన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

శంకర్, రామ్ చరణ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ ఫిక్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రానికి ఏర్పాట్లన్నీ పూర్తైనట్టు తెలుస్తోంది. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని సమాచారం.