'జయదేవ్' చిత్రంలోని నాలుగో పాటని రిలీజ్ చేసిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ

  • IndiaGlitz, [Thursday,May 25 2017]

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌'. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఇప్పటికే రిలీజైన మూడు పాటలకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రంలోని 4వ పాటని మే 24న దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ రేడియో సిటీలో రిలీజ్‌ చేశారు. 'ఓ నవ్వులో ఇంతుందా.. ఇంతుందా..' అనే ఫ్యామిలీ పాటని అనంతశ్రీరామ్‌ రాయగా, సాహితి చాగంటి పాడారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్‌ ఫస్ట్‌వీక్‌లో వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్‌ కానుంది.

దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ మాట్లాడుతూ - ''ఓ నవ్వులో ఇంతుందా.. ఇంతుందా.. నేనెప్పుడూ ఊహించని వింతుందా..'' అనే ఫ్యామిలీ మెలోడీ పాటని లాంచ్‌ చేశాం. హీరో, పిల్లలు, అక్క బావలతో కలిసి పాడే పాట ఇది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ లవ్‌లీ ట్యూన్స్‌ కంపోజ్‌ చేశాడు. అనంతశ్రీరామ్‌ ఎక్స్‌ట్రార్డినరీ లిరిక్స్‌ రాశారు. 'జయదేవ్‌'ల అన్నీ పాటల కంటే ఈ పాట సెపరేట్‌. హీరో సస్పెండ్‌ అయి ఫ్రస్టేషన్‌లో వున్నప్పుడు సెకండ్‌ హాఫ్‌లో ఈ పాట వస్తుంది. విజువల్‌గా కూడా అద్భుతంగా ఈ పాటని పిక్చరైజేషన్‌ చేశాం. కెమెరామెన్‌ జవహార్‌ రెడ్డి, గంటా రవిని మా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ సందర్భంలో సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్‌ వుంది.. అని చెప్పాడు. నాకు కూడా అతన్ని చూడగానే తనలో హీరో మెటీరియల్‌ వుంది అన్పించింది. హీరోగా లాంచ్‌ చేస్తే తప్పకుండా సక్సెస్‌ అవుతాడు అన్న ఫీలింగ్‌ కలిగింది. ఆ తర్వాత తెల్సింది మినిష్టర్‌ గంటా శ్రీనివాసరావుగారి అబ్బాయి అని. ఇదొక సిన్సియర్‌ పోలీసాఫీసర్‌ కథ. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన 'సేతుపతి' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎన్నో మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. పరుచూరి బ్రదర్స్‌గారు మరోసారి తమ పెన్‌ పవర్‌ చూపించారు. 'జయదేవ్‌' పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో రవి అమేజింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు. మాళవికని హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్‌ చేశాం. 'ప్రేమించుకుందాం..రా' చిత్రం మే 9కి 20 ఏళ్లు కంప్లీట్‌ అయ్యింది. 3 పాటలు మహేష్‌ అనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేశాడు. అతనికి హెల్త్‌ ప్రాబ్లెమ్‌ అవడంతో మిగితా మూడు పాటల్ని మణిశర్మ కంపోజ్‌ చేశాడు. నేను చేసిన 12 చిత్రాల్లో 9 చిత్రాలకి మణిశర్మ మ్యూజిక్‌ ఇచ్చాడు. అప్పట్నుంచీ మణిశర్మతో నా జర్నీ కొనసాగుతుంది. అన్ని చిత్రాలకి ఔట్‌ స్టాండింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు మణి. 'జయదేవ్‌'కి కూడా బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. ఈ చిత్రంలో 3 మెలోడీ సాంగ్స్‌, మాస్‌ మసాలా సాంగ్‌ అద్భుతంగా చేశాడు. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 1987లో అశోక్‌కుమార్‌ నిర్మించిన 'ధృవనక్షత్రం' సినిమాకి నేను క్లాప్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాను. అశోక్‌కుమార్‌గారు నిర్మాతగా 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్‌' చిత్రాలకి దర్శకత్వం వహించాను. 'ఈశ్వర్‌'తో ప్రభాస్‌ని ఇంట్రడ్యూస్‌ చేశాం. ప్రభాస్‌లాగా గంటా రవి కూడా మంచి హైట్‌, పర్సనాలిటీ వుంది. 'జయదేవ్‌'తో గంటా రవి హీరోగా పరిచయం చేస్తున్నాం. డెఫినెట్‌గా గంటా రవి కమర్షియల్‌ హీరోగా పేరు తెచ్చుకుంటాడు'' అన్నారు.

గాయని సాహితి చాగంటి మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో రెండు పాటలు పాడాను. ఫస్ట్‌టైమ్‌ సోలో పాట ఈ చిత్రంలో పాడాను. ఈ ఆల్బమ్‌లో 'ఓ నవ్వులో ఇంతుందా..' నాకిష్టమైన పాట. ఈ అవకాశాన్ని ఇచ్చిన మణిశర్మగారికి, దర్శకులు జయంత్‌గారికి నా థాంక్స్‌'' అన్నారు.

గంటా రవి, మాళవిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో వినోద్‌కుమార్‌, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని, వెన్నెల కిషోర్‌, హరితేజ, శ్రావణ్‌, సుప్రీత్‌, కోమటి జయరామ్‌, రాజేశ్వరి, శివారెడ్డి, కాదంబరి కిరణ్‌, బిత్తిరి సత్తి, కరుణ, మీనా, జ్యోతి, రవిప్రకాష్‌, అరవింద్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: జవహర్‌రెడ్డి, మూల కథ: అరుణ్‌కుమార్‌, రచన: పరుచూరి బ్రదర్స్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: కృష్ణమాయ, స్టిల్స్‌ నారాయణ, కో-డైరెక్టర్‌: ప్రభాకర్‌ నాగ్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: పి.రామమోహన్‌రావు, నిర్మాత: కె.అశోక్‌కుమార్‌, దర్శకత్వం: జయంత్‌ సి. పరాన్జీ.

More News

మే 28న 'అంధగాడు' ప్రీ రిలీజ్ ఫంక్షన్

యువ కథానాయకుడు రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

రజనీకాంత్ 'కాలా'

సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మే 28న సినిమా స్టార్ట్ కానుంది. కబాలి తర్వాత పారంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ధనుష్ తన స్వంత బ్యానర్ వండర్ బార్స్పై నిర్మిస్తున్నాడు.

పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న 'సత్యా గ్యాంగ్'

'మన కోసం మనం బ్రతకడం కాదు.. పదిమంది కోసం బ్రతకాలి' అనే నినాదానికి పుష్కలమైన వినోదం జోడించి రూపొందుతున్న

'మామ్' చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెబుతున్న శ్రీదేవి

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ఐ పిక్చర్స్ పతాకాలపై 'మామ్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.

'వైశాఖం' థీమ్ టీజర్ కి 1.3 మిలియన్ వ్యూస్

డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అయ్యాయి. వాటన్నింటినీ మించి లేటెస్ట్గా జయ బి. దర్శకత్వంలో రూపొందిన 'వైశాఖం' ఆడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సూపర్ డైరెక్టర్ కొరటాల శివ విడుదల చేసిన 'వైశాఖం' థీమ్ టీజర్కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.