విజయ్ దేవరకొండకి ఓకే చెప్పిన జాన్వీ కపూర్

  • IndiaGlitz, [Monday,December 16 2019]

విజ‌య్ దేవ‌ర‌కొండ ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధ‌మ‌వుతుంది. నిజానికి విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌ను మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు సౌత్ రేంజ్‌కు తీసుకెళుతుంటే డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ విజ‌య్‌ని త‌న ఫైట‌ర్‌తో ప్యాన్ ఇండియా హీరోను చేయ‌బోతున్నాడు. అందుకు త‌గిన విధంగా క‌థ‌ను కూడా సిద్ధం చేస్తున్నాడు. తెలుగులో పూరి ద‌ర్శ‌క‌త్వంలో పూరి, ఛార్మి నిర్మించ‌బోయే ఈ సినిమా జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఇక ఉత్త‌రాదిన ఈ సినిమాను క‌ర‌ణ్ జోహార్ విడుద‌ల చేయ‌బోతున్నారు. చ‌ర్చ‌లు కూడా పూర్త‌య్యాయి. క‌ర‌ణ్ జోహార్ సీన్‌లోకి రాగానే 'ఫైట‌ర్' రేంజ్ మారిపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా మార్చ‌డానికి అన్ని హంగులు అద్దుతున్నారు.

అందులో భాగంగా ఇప్పుడు జాన్వీక‌పూర్‌ను హీరోయిన్‌గా న‌టింప చేయ‌బోతున్నార‌ట‌. ముందుగా పూరి జ‌గ‌న్నాథ్ జాన్వీక‌పూర్‌ను న‌టింప చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేసినా ఆమె డైరీ ఫుల్‌గా ఉండ‌టంతో ఆమె చూద్దాం.. చేద్దాం అంటూ వ‌చ్చింది. అయితే క‌ర‌ణ్ జోహార్ ఆమెను ఒప్పించాడు. త‌న‌కు సినీ గురువు అయిన క‌ర‌ణ్ జోహార్ కోర‌డంతో జాన్వీ క‌పూర్ నో చెప్ప‌లేక‌పోయింది. సినిమా జ‌న‌వ‌రి నుండి స్టార్ట్ అయితే జాన్వీక‌పూర్ మాత్రం సెట్స్‌లో ఫిబ్ర‌వ‌రి నుండి జాయిన్ అవుతుంద‌ట‌. మొత్తానికి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జాన్వీ సౌత్ ఎంట్రీ ఇవ్వ‌నుండ‌టం ఖాయంగా మారింది.

More News

‘సరిలేరు నీకెవ్వరు’: హీ ఈజ్ సో క్యూట్.. రొమాంటిక్ సాంగ్ విడుదల

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో

'ఇద్ద‌రి లోకం ఒకటే' స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌: రాజ్‌త‌రుణ్‌

యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇద్దరి లోకం ఒకటే'. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ నిర్మాతగా

'దొంగ' అన్ని ఎమోషన్స్‌ ఉన్న ఒక బ్యూటిఫుల్‌ ఫ్యామిలీఎంటర్‌టైనర్‌ - కార్తీ

'ఖైదీ'లాంటి ఎమోషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చి ప్రేక్షకుల అపూర్వఆదరాభిమానాలను అందుకున్న యాంగ్రీ హీరో కార్తీ హీరోగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ పతాకాలపై `దృశ్యం' ఫేమ్‌

డిసెంబర్ 27న ధనుష్‌, గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌ల 'తూటా'!!

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ హీరోగా, లెజెండరీ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్ తోట'. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ను తెలుగులో

కోపంగా ఉన్న మ‌హేశ్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. ప్ర‌స్తుతం అన్న‌పూర్ణ సెవెన్ ఏక‌ర్స్‌లో సినిమాకు సంబంధించిన పాట‌ల