టాలీవుడ్ న్యూ విలన్ జాన్ కొక్కేన్..

  • IndiaGlitz, [Tuesday,April 12 2016]

ల‌వ్ ఇన్ సింగ‌పూర్ అనే మ‌ల‌యాళ సినిమా ద్వారా న‌టుడుగా ప‌రిచ‌య‌మై...అన‌తి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న యువ న‌టుడు జాన్ కొక్కేన్. మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, త‌మిళ్ చిత్రాల్లో న‌టించిన జాన్ కొక్కేన్ తాజాగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.. హీరోగా చేయ‌డం క‌న్నా విల‌న్ గా చేయ‌డ‌మే ఇష్టం అంటున్నారు జాన్ కొక్కేన్. అలాగ‌ని విల‌న్ వేషాలే వేస్తాన‌ను కోవ‌ద్దు...క్యారెక్ట‌ర్ న‌చ్చాలే కానీ..ఏ పాత్ర అయినా స‌రే చేస్తానంటున్నారు జాన్.
మ‌ల‌యాళ సినిమా ల‌వ్ ఇన్ సింగ‌పూర్ లో మ‌మ్ముటి తో క‌ల‌సి న‌టించిన జాన్ ఆత‌ర్వాత‌ ప‌లు మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టించారు. మ‌ల‌యాళ చిత్రాల త‌ర్వాత‌ క‌న్న‌డ చిత్రాల్లో కూడా న‌టించారు. క‌న్న‌డ సినిమాలో జాన్ న‌ట‌న‌ను చూసి త‌మిళ్ లో ధ‌ర‌ణి అవ‌కాశం ఇచ్చారు. ఆత‌ర్వాత త‌మిళ్ లో సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌ద‌గ‌జ‌రాజా చిత్రంలో న‌టించారు. ఈ చిత్రంలో విశాల్ తో క‌లిసి చేసిన యాక్ష‌న్ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేసాడ‌ట జాన్. అలాగే అజిత్ తో క‌లిసి వీర‌మ్ అనే సినిమాలో న‌టించాడు. ఆ స‌మ‌యంలో ప‌ర్ ఫార్మెన్స్ ప‌రంగా ఎలా చేస్తే బాగుంటుందో చెబుతూ జాన్ ని అజిత్ బాగా ప్రొత్స‌హించేవార‌ట‌.
ఒక తెలుగు సినిమా విష‌యానికి వ‌స్తే...ప్ర‌స్తుతం జాన్ కొక్కేన్ ఎన్టీఆర్ న‌టిస్తున్న జ‌న‌తా గ్యారేజ్ చిత్రంలో న‌టిస్తున్నారు. అలాగే ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న చుట్టాల‌బ్బాయి చిత్రంలో మెయిన్ విల‌న్ గా జాన్ కొక్కేన్ న‌టిస్తుండ‌డం విశేషం. జూన్ మొద‌టివారంలో చుట్టాల‌బ్బాయి చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. మ‌రి...టాలీవుడ్ న్యూ విల‌న్ జాన్ కొక్కేన్ తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ మంచి న‌టుడుగా గుర్తింపు సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

More News

క‌బాలి రిలీజ్ డేట్ క‌న్ ఫ‌ర్మ్ చేసిన‌ ర‌జ‌నీ..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కించిన‌ చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని క‌లైఫులి ధాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న క‌బాలి చిత్రాన్ని ఈనెల 14న రిలీజ్ చేయాల‌నుకున్నారు.

కమల్ - శృతి కలిసి నటించే సినిమా ప్రారంభం..

కమల్ హాసన్-శృతి హాసన్ ఈ తండ్రి కూతురు ఇద్దరూ కలసి ఒక సినిమాలో నటించనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

నాలాగా పోరాటం చేస్తున్న ఎంతో మంది విజ‌య‌మే ఈ ప‌ద్మ‌శ్రీ అవార్డ్ - సునీతా కృష్ణ‌న్ (నా బంగారు తల్లి - ప్రొడ్యూసర్)

మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణ పై అలుపెర‌గ‌ని పోరాటం చేసిన సునీతా కృష్ణ‌న్ కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ద‌క్కింది. ఈరోజు రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఆమె ఈ అవార్డ్ అందుకున్నారు.

వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల మూవీ ముహుర్తం..

మెగా హీరో వ‌రుణ్ తేజ్ - శ్రీను వైట్ల కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపొందనున్న‌ద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మిస్తున్నారు.

జ‌న‌తా గ్యారేజ్ జాత‌కం చెప్పిన సూర్య‌..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు.