close
Choose your channels

SIIMA Awards 2023 : నా ప్రతి కన్నీటి చుక్కకూ వాళ్లు బాధపడ్డారు.. వారికి పాదాభివందనం , ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

Saturday, September 16, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దుబాయ్ వేదికగా జరుగుతున్న సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) 2023 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్‌ అయ్యారు.

నన్ను నమ్మిన నా జక్కన్నకు థ్యాంక్స్ చెప్పారు. ఆర్ఆర్ఆర్‌లో తనతో పాటు నటించిన రామ్‌చరణ్‌కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ఆయనను బ్రదర్ అంటూ సంబోధించిన ఎన్టీఆర్.. ఆ తర్వాత అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ నేను జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కంటి వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్లు కూడా బాధపడ్డారు. నేను నవ్వినప్పుడల్లా సంతోషపడ్డారు.. నన్ను అభిమానించే వారందరికీ పాదాభివందనం చేస్తున్నాను’’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి సైమా పట్టం కట్టింది. ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడిగా రాజమౌళి, సంగీత దర్శకుడిగా ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్ కుమార్‌లు అవార్డులు అందుకున్నారు. అయితే రాజమౌళి కుటుంబం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. రాజమౌళి తరపున జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి తరపున చంద్రబోస్ అందుకున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.