Jr Ntr : అప్‌డేట్స్ కోసం ఒత్తిడి తేవొద్దు.. ఏమైనా వుంటే భార్య కంటే ముందు మీకే చెబుతా : అభిమానులకు ఎన్టీఆర్ క్లాస్

  • IndiaGlitz, [Monday,February 06 2023]

టాలీవుడ్ యువ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్‌డేట్స్ కావాలంటూ దర్శక నిర్మాతల మీద ఒత్తిడి తీసుకురావొద్దని ఆయన అభిమానులను కోరారు. తన సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ .. తనకు ఆరోగ్యం బాగోకపోయినా ఈవెంట్‌కు వచ్చానని తెలిపారు. తమ కుటుంబంలో ఎంతోమంది నటులున్నా.. ప్రయోగాలు చేసేది అన్నయ్య ఒక్కరేనని ఎన్టీఆర్ ప్రశంసించారు. నటుడిగా, నిర్మాతగా తన సినిమాల్లో సాంకేతికతకు పెద్దపీట వేసింది ఆయనేనని అన్నారు. అమిగోస్ చిత్రం అన్నయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోతుందని ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

నాకే కాదు అందరు హీరోలది ఇదే పరిస్ధితి :

సరిగ్గా ఇదే సమయంలో తన కొత్త చిత్రం అప్‌డేట్ ఇవ్వాలంటూ గోల చేయడంత ఎన్టీఆర్ స్పందించారు. తాము ప్రతిరోజూ, ప్రతి పూటా , ప్రతి గంటకూ అప్‌డేట్ ఇవ్వాలంటే చాలా కష్టమన్నారు. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతల మీద ఒత్తిడి పెరుగుతోందని.. ఫ్యాన్స్ కోసమని ఏది పడితే అది చెప్పలేరని ఎన్టీఆర్ తెలిపారు. అప్‌డేట్ గనుక నచ్చకపోతే మళ్లీ ఫ్యాన్స్ నుంచి ట్రోలింగ్ ఎదురువుతోందన్నారు. ఇది తన విషయంలోనే కాకుండా మిగిలిన అందరూ హీరోలకూ జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇవ్వాల్సిన సమయంలో , అదిరిపోయే అప్‌డేట్ వుంటే ఇంట్లో భార్యల కంటే ముందు మీకే చెబుతామని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఇక చివరిలో అభిమానుల కోరికను తీర్చారు ఎన్టీఆర్. ఈ నెలలోనే తన తదుపరి సినిమాను ప్రారంభిస్తున్నానని, మార్చి 20 లోపే షూటింగ్ మొదలుపెడతామని ఆయన తెలిపారు. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఎన్టీఆర్ ప్రకటించారు.

రాజేంద్రకు సినిమా అంటే ఎంతో తపన:

ఇదే సమయంలో అమిగోస్ చిత్ర దర్శకుడు రాజేంద్ర రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు ఎన్టీఆర్. ఆయన ఇంజనీరింగ్ చదవి పరిశ్రమలోకి అడుగుపెట్టారని.. అయితే ఉద్యోగం చేసుకోకుండా ఈ సినిమాలేంటీ అని ఆయన తల్లిదండ్రులు అడిగారని తెలిపారు. అయితే రాజేంద్ర మాత్రం ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ఇంటికి వస్తానని చెప్పారని.. కానీ ఈ సినిమా ప్రారంభమయ్యేలోపు తన తల్లిని, షూటింగ్ చివరి దశలో తండ్రిని కోల్పోయారని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రను చూస్తుంటే సినిమా పట్ల ఓ వ్యక్తికి ఇంత తపన వుంటుందని అని అనిపిస్తుందని యంగ్ టైగర్ కొనియాడారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలిలను సైతం ఎన్టీఆర్ ఆకాశానికెత్తేశారు. 85 ఏళ్ల తెలుగు చిత్ర సీమలో ఒకే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండు సినిమాలు విడుదలై, రెండూ సూపర్‌హిట్ అందుకోవడం ఈ సంస్థకే సాధ్యమైందని జూనియర్ అన్నారు.

More News

Bhanupriya:భర్త మరణం, ఒంటరితనం.. ఇప్పుడు మొమరీలాస్‌: సీనియర్ హీరోయిన్ భానుప్రియ కష్టాలు

భానుప్రియ.. ఈ పేరు వినగానే కలువల్లాంటి పెద్ద కళ్లు, అద్భుతమైన డ్యాన్సర్ గుర్తొస్తారు. 80వ దశకంలో టాలీవుడ్, కోలీవుడ్, హిందీ ప్రేక్షకులను అలరించారు భానుప్రియ.

Pervez Musharraf : పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత.. ఆ కోరిక తీరకుండానే

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లుగా దుబాయ్‌ వార్తాసంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్నాయి.

Vani Jairam : చిత్ర సీమకు మరో విషాదం.. లెజండరీ సింగర్ వాణీ జయరామ్ కన్నుమూత

ఇప్పటికే జమున, సాగర్, కే విశ్వనాథ్‌ల మరణాలతో శోకసంద్రంలో మునిగిపోయిన చిత్రసీమకు మరో షాక్ తగిలింది.

Mahesh - Trivikram: షూటింగ్ స్పాట్‌లో బ్యాట్ పట్టుకున్న త్రివిక్రమ్.. వీడియో వైరల్, మహేశ్ ఫ్యాన్స్ ఫన్నీ పోస్ట్‌లు

సినిమాను తెరకెక్కించడమంటే మామూలు విషయం కాదు. షూటింగ్, సెట్స్, ప్రొడక్షన్, సవాలక్ష తలనొప్పులు.

Taraka Ratna: రోజులు గడుస్తున్నా స్పృహలోకి రాని తారకరత్న.. విదేశాలకు తరలించే ఛాన్స్..?

గుండెపోటుకు గురైన సినీనటుడు నందమూరి ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే వున్నప్పటికీ.. ఆయన ఇంకా ప్రమాదం నుంచి బయటపడలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి.