ఎప్పుడూ నా పక్కనే వున్నందుకు థ్యాంక్స్.. చరణ్‌కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్

  • IndiaGlitz, [Sunday,March 27 2022]

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు . ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్‌లో తన కోస్టార్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. చరణ్‌కు బర్త్‌డే విషెస్ తెలియజేశారు. వీరిద్దరి మధ్యా ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్‌షిప్ వుండగా.. ఆర్ఆర్ఆర్‌తో అది మరో మెట్టెక్కింది. వీరిద్దరి మైత్రి చూసి మెగా- నందమూరి అభిమానులు ముచ్చట పడుతున్నారు.

ఇక.. చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘‘నువ్వు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి.. ఎప్పుడూ నా పక్కనే వున్నందుకు కృతజ్ఞతలు... మన స్నేహంలో మరిన్ని జ్ఞాపకాలను సృష్టించుకుందాం,’’ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ సెట్‌లో తాను చరణ్‌కు చొక్కా బొత్తలు పెడుతున్న ఫోటోను జూనియర్ షేర్ చేశారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ల సందర్భంగా చరణ్, ఎన్టీఆర్ ఒకరిపై వున్న అభిమానాన్ని మరొకరు పంచుకున్నారు. ఇకపోతే.. ట్రిపుల్ ఆర్ మూవీ వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టి టాలీవుడ్ సత్తాను చాటింది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుంది.. దీనికి సంబంధించి ట్రేడ్ పండితులు పలు అంచనాలు వెలువరిస్తున్నారు.

More News

అతడే నా గౌరవం.. చరణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి, ఫ్యాన్స్ కోసం అరుదైన ఫోటో

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇవాళ 38వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ పుట్టినరోజు ఆయనకు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి.

మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ఉచిత రేషన్ పథకం పొడిగింపు, ఎన్ని నెలలంటే

కరోనా కారణంగా మనదేశంలో ఎలాంటి పరిస్దితులు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: లోయలో పడ్డ పెళ్లి బస్సు, 8 మంది దుర్మరణం .. మోడీ, జగన్ దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు.

మొత్తానికి షాకిచ్చారుగా.. నిక్కీ గల్రానీతో ఆది పినిశెట్టి నిశ్చితార్థం, ఫొటోలు వైరల్

టాలీవుడ్‌లో మరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పెళ్లిపీటలెక్కనున్నాడు. ఆయన ఎవరో కాదు. ఆది పినిశెట్టి.

వాళ్లందరికీ థ్యాంక్స్ : ఎట్టకేలకు బయటకొచ్చి గుడ్‌న్యూస్ , సాయితేజ్ వీడియో వైరల్

గతేడాది రోడ్డు ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇంటికే పరిమితమైపోయారు మెగా హీరో సాయిధరమ్ తేజ్.