K Viswanath: అందుకే ఆయన కళాతపస్వి : చివరి శ్వాస వరకు కళామతల్లి సేవలోనే.. పాట రాస్తూ మృత్యు ఒడిలోకి

  • IndiaGlitz, [Friday,February 03 2023]

తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త నడకను నేర్పి, ఎన్నో అపురూప చిత్రాలను అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన నిష్క్రమణతో టాలీవుడ్‌లో ఒక శకం ముగిసినట్లయ్యింది. సౌండ్ రికార్డిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ్.. దిగ్గజ దర్శకుడిగా ఎదిగారు. అయితే ఆయన మరణించే చివరి క్షణాల వరకు కళామతల్లి సేవలోనే గడిపారు. తన చివరి క్షణాలకు ముందు పాట రాస్తూ .. ఇక రాయలేక దానిని కుమారుడి చేతికి అందించి,తన వల్ల కాదని పాటను పూర్తి చేయాల్సిందిగా చెప్పారు. కానీ ఆయన రాస్తుండగానే విశ్వనాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే విశ్వనాథ్ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణవార్తతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

ఇది విశ్వనాథ్ ప్రస్థానం:

1930 ఫిబ్రవరి 19న అప్పటి గుంటూరు జిల్లా (ప్రస్తుతం బాపట్ల జిల్లా) రేపల్లెలోని పెద పులివర్రు గ్రామం. తల్లిదండ్రులు కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ . గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్, ఏసీ కాలేజీలో బీఎస్సీ అభ్యసించారు. ఆయన తండ్రి మద్రాస్‌లోని విజయవాహినీ స్టూడియోలో పనిచేశారు. దీంతో విశ్వనాథ్ సైతం విజయవాహినీలో సౌండ్ రికార్డిస్ట్‌గా చేరి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి దర్శకత్వం వహించిన పాతాళ బైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్‌గా పనిచేశారు. అలా సినీ రంగంలోని అన్ని శాఖలపై పట్టు సాధిస్తూ 1965లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకుడిగా మారారు. సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ, శృతిలయలు, సిరివెన్నెల, ఆపద్భాంధవుడు, శంకరాభరణం వంటి ఆణిముత్యాలను టాలీవుడ్‌కు అందించి తెలుగు చిత్రసీమకు పేరు ప్రఖ్యాతులను తీసుకొచ్చారు.

తన సినీ ప్రస్థానంలో 50కి పైగా సినిమాలకు దర్శకత్వంలో వహించారు విశ్వనాథ్. ఇందులో 9 హిందీ సినిమాలు కూడా వున్నాయి. మూసలో వెళ్తున్న తెలుగు చిత్ర సీమకు ఆయన కొత్త దిశను చూపారు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి నటుడిగా అవతారమెత్తారు విశ్వనాథ్. అలా తెలుగు, తమిళ భాషల్లో 30 వరకు సినిమాల్లో నటించారు.

సినీ రంగానికి విశ్వనాథ్ చేసిన కృషికి గాను.. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘‘దాదాసాహెబ్ ఫాల్కే’’ అవార్డ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. 1992లో రఘుపతి వెంకయ్య అవార్డ్, అదే ఏడాది పద్మశ్రీ పురస్కారాలు ఆయనను వరించాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్వనాథ్‌ను గౌరవ డాక్టరేట్‌తో గౌరవించింది. ఇక విశ్వనాథ్ తెరకెక్కించిన స్వాతిముత్యం 59వ ఆస్కార్ చిత్రాల బరిలో నిలిచింది. అలాగే స్వాతిముత్యం, సాగర సంగమం, సిరివెన్నెల వంటి చిత్రాలు ఆసియా పసిఫిక్ చలనచిత్రాలు ప్రదర్శితమయ్యాయి.

More News

K Viswanath : దివికేగిన కళాతపస్వి.. కే. విశ్వనాథ్ కన్నుమూత, శోకసంద్రంలో టాలీవుడ్

జమున, సాగర్‌ మరణాల నుంచి కోలుకోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు,

Rangamarthanda:'రంగమార్తాండ' నుండి బ్రహ్మానందం గ్లిమ్స్ విడుదల!!!

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా 'రంగమార్తాండ' నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

Vedha :ఫిబ్రవరి 9న 'వేద' రిలీజ్

కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్  నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ...

Telusa Manasa: ‘తెలుసా..మనసా..’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్‌గా శ్రీబాలాజీ పిక్చర్స్, బ్యాన‌ర్‌పై వైభ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో

Nandamuri Taraka Ratna : తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలయ్యకు థ్యాంక్స్

గుండెపోటుకు గురై ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్ధితి విషమంగానే