అవునా కాజల్... నిజంగా నిజమేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
ఇప్పుడు కాజల్ని చూసిన వాళ్లు చాలా మంది వింతగా అచ్చం ఇలానే అడుగుతున్నారు. అవునా కాజల్.. నిజంగా నిజమేనా? అని. ఎందుకంటే ఆమె తాజ్ని చూసి ఆశ్చర్యపోవడం చూసి, మన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పటి లక్ష్మీ కల్యాణం... అంతకు ముందంటే మధ్య తరగతి కుటుంబం, చదువు, ఉద్యోగం అంటూ బిజీగా ఉందనే అనుకుందాం. సినిమాల్లోకి వచ్చిన తర్వాతైనా చేతి నిండా డబ్బులు, అనుకున్నప్పుడు తీసుకున్న వెకేషన్లు... ఇన్నిటిలోనూ ఒక్కసారంటే ఒక్కసారి తాజ్మహల్ను చూడాలని అనిపించలేదా కాజల్కు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వెళ్లడమేంటి? అని జనాలు నోళ్లు నొక్కుకుంటున్నారు. అయితే కాజల్ మాత్రం అదేమీ పట్టనట్టు.. తన ఎగ్జయిట్మెంట్ను జబర్దస్త్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
"తాజ్మహల్ని తొలిసారి చూశాను. మెస్మరైజ్ అయిపోయా. స్పెల్బౌండ్ అయిపోయా. అలా నోరెళ్లబెట్టి నిలబడిపోయా. ఆ భారీతనాన్ని, తాజ్ విశ్వరూపాన్ని చూసి నాకు నోట మాట రాలేదు. నా చిన్న తనం నుంచి తాజ్ మహల్ గురించి ఎంతో విన్నాను. చూసొచ్చిన వాళ్లు ఎన్నో విషయాలు చెప్పారు. కానీ నా అంతట నేను, అక్కడ అడుగుపెట్టిన క్షణాలు అపురూపమైనవి. అద్భుతమైనవి. అక్కడ వినిపించే ధ్వని, తాజ్మహల్ నిర్మాణం, అందులో పొదిగిన విలువైన విషయాలు, ఆ కట్టడాలు.. కొంతసేపు నన్ను చరిత్ర చుట్టిముట్టేసింది. నా మనసులో తీయటి అనుభూతిని మిగిల్చింది. వావ్ తాజ్`` అని కాజల్ పోస్ట్ చేసింది.
తన చిన్న తనం నుంచి ప్రతి ఏడాదీ రెండు ట్రిప్లకు తల్లిదండ్రులు తీసుకెళ్లేవారు అని కాజల్ పలుమార్లు పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది. వాటిలో ఒకటి స్వదేశంలో ఉండగా, మరొకటి విదేశంలో ఉండేదనీ చెప్పారు. అయితే ఈ భామకు తాజ్ని దర్శించడానికి ఇప్పటికి కుదిరిందన్నమాట. ఏదైనా మన దేశంలో ఉన్న ఏడో వింతను చూసేసిందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.