గర్భవతిగా.. పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ వ్యాయామాలు

  • IndiaGlitz, [Thursday,January 20 2022]

టాలీవుడ్ అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ గర్భం దాల్చిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి ఇటీవల కాజల్ దంపతులు తెరదించారు. కాజల్ గర్భవతి అంటూ ఆమె భర్త గౌతమ్ కిచ్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గౌతమ్.. '2022.. నిన్నే చూస్తున్నా..' అంటూ ప్రెగ్నెంట్‌ లేడీ ఎమోజీని ఎటాచ్‌ చేశారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు కాజల్-గౌతమ్ లకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరోవైపు పుట్టబోయే బిడ్డ కోసం కాజల్ అగర్వాల్ కొత్త జర్నీ ప్రారంభించారు. గర్భం దాల్చిన మహిళలు చేసే వ్యాయామాలు చేయడం స్టార్ట్ చేశారు. prenatal journey ( గర్భం దాల్చిన సమయంలో మహిళలు తీసుకునే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు) చేయడం సంతోషంగా ఉంది అని కాజల్ తెలిపారరు.

తెలుగుతో పాటు దక్షిణాదిలోని అగ్రహీరోలందరితో నటించిన కాజల్.. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని గతేడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పకుండా.. ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటించారు కాజల్. టాలీవుడ్ అగ్రకథానాయకుడు చిరంజీవితో ఆమె నటించిన 'ఆచార్య' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ‘‘ఉమ’’ అనే బాలీవుడ్ సినిమాలోనూ నటించింది. ఈ మూవీ విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఇందులో తానొక మిస్టీరియ‌స్ అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తానని అభిమానులకు కాజల్ తెలియజేశారు.

అయితే తమిళ దర్శక దిగ్గజం శంకర్- విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘ఇండియ‌న్ 2’’లోనూ కాజల్ ఛాన్స్ దక్కించుకుంది. అయితే అనుకోని కారణాల వల్ల ఇప్పుడా ప్రాజెక్ట్ ఆగింది. అలాగే నాగార్జున- ప్రవీణ్ సత్తారు కలయికలో రూపొందుతున్న ‘‘ది ఘోస్ట్’’లోనూ కాజలే హీరోయిన్. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని ఫిలింనగర్ టాక్.

More News

మీ శ్రద్ధకు కృతజ్ఞుడిని... సీఎం జగన్‌కు కైకాల సత్యనారాయణ లేఖ

అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కోలుకున్నారు.

టాలీవుడ్‌లో మరో విషాదం : నటుడు కన్నుమూత .. సంక్రాంతికి ఇంటికొచ్చి కానరాని లోకాలకు

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది కరోనా, ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు తదితర కారణాలతో సినీ ప్రముఖులు కన్నుమూశారు.

"హీరో" సినిమాలో పర్మార్మెన్స్ తో ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్

తన కొత్త సినిమా "హీరో"తో ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది అందాల తార నిధి అగర్వాల్. గల్లా అశోక్ డెబ్యూ ఫిల్మ్ గా వచ్చిన హీరో చిత్రంలో నిధి గ్లామర్,

అలసిపోయా ఇక ఆడలేను.. ఇదే నా చివరి సీజన్ : టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సానియా

భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన టెన్నిస్ కెరీర్‌‌కు వీడ్కోలు ప్రణాళికలు వెల్లడించింది.

కేంద్రానికి రూ.30,791 కోట్ల బాకీ తీర్చిన రిలయన్స్ జియో

కేంద్ర ప్రభుత్వానికి రిలయన్స్ జియో బాకీ తీర్చేసింది. స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి రూ.30,791 కోట్ల బకాయిలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించినట్లు జియో ప్రకటించింది.