పంజాబీ చిత్రంలో కాజ‌ల్‌?

  • IndiaGlitz, [Friday,June 08 2018]

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తిరుగులేని క‌థానాయిక‌గా పేరు తెచ్చుకుంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ప‌దేళ్ళ‌కు పైగా క‌థానాయిక‌గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్ప‌టికీ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉంది. ఒక్క తెలుగులోనే కాకుండా త‌మిళ్‌, హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోనూ స‌క్సెస్‌ఫుల్ క‌థానాయిక‌గా రాణించింది.

ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ త్వ‌ర‌లోనే ఓ పంజాబి చిత్రం చేయ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. కాజ‌ల్ కెరీర్‌లో ఇదే తొలి పంజాబి సినిమా కావ‌డం. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెలువ‌డ‌తాయి.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం కాజ‌ల్ క్వీన్ త‌మిళ రీమేక్ అయిన పారిస్ పారిస్ చిత్రంతో బిజీగా ఉంది. అలాగే ర‌వితేజ హీరోగా సంతోష్ శ్రీ‌నివాస్ రూపొందిస్తున్న తెరి రీమేక్‌లోనూ ఓ హీరోయిన్‌గా న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

More News

నాని, త్రివిక్ర‌మ్ చిత్రం అప్పుడేనా?

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది.

ఏక‌ధాటిగా 'సైరా నరసింహారెడ్డి' షూటింగ్‌

బాక్సాఫీస్‌కు కొత్త లెక్క‌లు నేర్పించిన క‌థానాయ‌కుడు మెగాస్టార్ చిరంజీవి. 10 ఏళ్ళ విరామం త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150'తో ప‌ల‌క‌రించినా..

శైల‌జా రెడ్డి అల్లుడు ఎప్పుడంటే..

మ‌హానుభావుడు వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు (ప్ర‌చారంలో ఉన్న పేరు).

దిల్ రాజు.. నాలుగోసారి

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుకు క‌లిసొచ్చిన సీజ‌న్ వేస‌వి. ఈ సీజ‌న్‌లో రిలీజ్ చేసిన చాలా సినిమాలు రాజుకు మంచి విజ‌యం అందించాయి.

'స‌మ్మోహ‌నం' సెన్సార్ పూర్తి!

అనూహ్య‌మైన క‌థాంశంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కిన 'స‌మ్మోహ‌నం' సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది.