కళ్యాణ్ రామ్ నిర్మాణం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ 27 వ చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Friday,February 10 2017]

జనతా గారేజ్ చిత్రం తో పలు రికార్డులు తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రం, సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో తెరకెక్కనుంది. పవర్ సినిమా తో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం నేడు ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయం లో ఘనం గా జరిగింది.
నందమూరి హరికృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, దర్శకులు వి వి వినాయక్, దిల్ రాజు, శిరీష్, భోగవల్లి ప్రసాద్, యలమంచిలి రవి శంకర్, కిలారు సతీష్, ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగ వంశి తదితరులు పూజా కార్యక్రమానికి విచ్చేసారు. తొలి షాట్ కి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా, నందమూరి హరికృష్ణ గారు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దేవుడి పఠాల పై తొలి షాట్ కు వి . వి . వినాయక్ గారు గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం లో ఒక హీరోయిన్ గా రాశీ ఖన్నా ను ఇప్పటికే ఖరారు చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి సి. కె. మురళీధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. 'టెంపర్ ' , 'నాన్నకు ప్రేమతో', 'జనతా గారేజ్ ' చిత్రాలతో భారీ హ్యాట్ ట్రిక్ ను అందుకున్న ఎన్టీఆర్ మళ్ళీ సరికొత్త లుక్ తో ఈ నూతన చిత్రం లో కనిపించనున్నారు.
నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, " సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై #NTR27 చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో నిర్మిస్తాం. దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీ ఎన్టీఆర్ లో ని స్టార్ కి , నటుడు కి న్యాయం చేసే విధం గా ఉంది. ఫిబ్రవరి 15 నుండి చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది" అని అన్నారు.
ఈ ఏడాది ద్వితీయార్ధం లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. ఈ చిత్రం లోని నటీ నటులు మరియు ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియ చేయబడతాయి

More News

'ఓం నమో వేంకటేశాయ' నాగార్జున కెరీర్ లో కలికితురాయి - మెగాస్టార్ చిరంజీవి

అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఎ. మహేష్రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. స్వరవాణి కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియులను విశేషంగా అలరిస్తోంది.

అనన్యగా ఆకట్టుకోనున్న తాప్సీ

నవతరం కథానాయికల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు.. బాలీవుడ్ లోనూ రాణిస్తున్న భామ తాప్సీ. నిన్నటివరకూ గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన తాప్సీ, "పింక్" మొదలుకొని అన్నీ వైవిధ్యమైన చిత్రాలు ఎంచుకొంటూ నటిగా మంచి గుర్తింపు సాధించింది.

ఆర్జీవీ పుట్టినరోజున రానున్న సర్కార్ 3

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం 'సర్కార్ 3'. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్ లో 3వ భాగం కావడం విశేషం.

'ఓం నమో వేంకటేశాయ' నా కెరీర్ లో ది బెస్ట్ చిత్రం అవుతుంది : కింగ్ నాగార్జున

అక్కినేని నాగార్జున ` దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృపా ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ‘శిరిడిసాయి’ నిర్మాత ఎ. మహేష్రెడ్డి నిర్మించిన భక్తిరస కథా చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’.

సినిమా కోసం తాప్సీ బెంగాలీ నేర్చుకుంది

దగ్గుబాటి రానా హీరోగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఘాజీ. పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో నిర్మించిన ఈ చిత్రం 1971 బ్యాక్డ్రాప్లో జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనౌక పేరే ఘాజీ. ఈ సినిమాలో తాప్సీ ఓ కీలకపాత్రలో నటించింది.