ఎన్టీఆర్ వంశీకి నో చెప్పడానికి కారణం ఏమిటో బయటపెట్టిన కళ్యాణ్ రామ్..!

  • IndiaGlitz, [Monday,October 17 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి రైట‌ర్ వ‌క్కంతం వంశీ క‌థ చెప్ప‌డం...క‌థ విని ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం జ‌రిగింది. ఈ చిత్రాన్ని జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత చేయాలి అనుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేసారు. మ‌రి...ఆత‌ర్వాత ఏమైందో ఏమో కానీ..జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత వక్కంతం వంశీతో సినిమా చేయ‌డానికి ఎన్టీఆర్ ఇంట్ర‌స్ట్ చూపించ‌లేదు.
దీంతో వ‌క్కంతం వంశీ బ‌న్నితో సినిమా చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే...వ‌క్కంతం వంశీతో సినిమా చేయ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణం ఏమిటో క‌ళ్యాణ్ రామ్ బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కీ ఏమ‌న్నారంటే...వంశీ చెప్పిన క‌థ న‌చ్చ‌లేదు. అందుక‌నే ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసాం అని చెప్పారు. మ‌రి క‌థ న‌చ్చ‌లేన‌ప్పుడు వంశీతో సినిమా చేస్తున్న‌ట్టుగా పోస్ట‌ర్స్ ఎందుకు రిలీజ్ చేసారో...?