క‌ళ్యాణ్ రామ్ కోసం హీరోయిన్ ని ఫిక్స్ చేసిన పూరి..

  • IndiaGlitz, [Friday,April 15 2016]

డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్..ప్ర‌స్తుతం రోగ్ అనే సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. మ‌హాత్మ నిర్మాత సి.ఆర్.మ‌నోహార్ అన్న కొడుకు ఇషాంత్ ను రోగ్ సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం చేస్తున్నారు. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందుతున్న‌ రోగ్ మూవీ ఇటీవ‌ల క‌ల‌క‌త్తా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ నెలాఖ‌రున చిత్రీక‌రించే సీన్స్ తో రోగ్ షూటింగ్ దాదాపు పూర్త‌వుతుంది.

వ‌చ్చే నెల‌లో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో పూరి సినిమా ప్రారంభించ‌నున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై రూపొందే ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టిస్తున్నారు. క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ కోసం చాలా మందిని ప‌రిశీలించి..ఫైన‌ల్ గా కృష్ణగాడి వీర ప్రేమ‌గాథ ఫేం మెహ‌రీన్ ని ఫిక్స్ చేసారు పూరి. వ‌చ్చే నెల‌లో ప్రారంభం అయ్యే ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

బాలీవుడ్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన చ‌ర‌ణ్‌..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ బాలీవుడ్ లో జంజీర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో చ‌ర‌ణ్  బాలీవుడ్లో మ‌రో మూవీ చేయ‌లేదు. అయితే రామ్ చ‌ర‌ణ్, స‌ల్మాన్ ఖాన్ తో క‌ల‌సి మ‌ల్టీస్టార‌ర్ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం ప్రారంభ‌మైంది.

నాగ్ పాత్ర‌లో అమితాబ్..

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ క‌ల‌సి న‌టించిన చిత్రం ఊపిరి. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన ఊపిరి చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. వీల్ ఛైర్ కూర్చికి ప‌రిమిత‌మైన పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడంటూ నాగార్జున పై సినీ విమ‌ర్శ‌కులు, సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

సుప్రీమ్ ట్రైల‌ర్ సూప‌ర్..

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం సుప్రీమ్. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

నాని - మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి చిత్రం 'జెంటిల్‌మ‌న్‌'

'అష్టా చమ్మా' తర్వాత నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.  ఈ చిత్రానికి `జెంటిల్‌మ‌న్‌` అనే పేరు పెట్టారు.

చిరంజీవి త‌ల్లి అంజ‌నా దేవి, అల్లు అర‌వింద్ స‌మ‌క్షంలో ఘ‌నంగా సుప్రీమ్ ఆడియో విడుద‌ల‌

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ - రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.