'నందమూరి' అనే ఇంటిపేరుకు మచ్చ తీసుకురాను!

  • IndiaGlitz, [Tuesday,January 14 2020]

టాలీవుడ్‌ హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు బిజిబిజీగా ఉన్న నందమూరి హీరో కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా రేపు అనగా జనవరి-15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈయన సినిమాలోనే కాదు.. రియల్‌గాను ‘చాలా మంచోడు’ అని నందమూరి వీరాభిమానులు, టాలీవుడ్‌లోని కొందరు ప్రముఖులు చెబుతుంటారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్ ఆసక్తిక విషయాలు చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా నాన్న హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ గురించి ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.

పేరుకు మచ్చ తీసుకురాను!

‘‘నందమూరి’ అనే ఇంటిపేరును మా తాతగారు మాకు ఇచ్చారు. ఆ పేరుకు మచ్చ తీసుకురాకూడదనే విషయాన్ని గుర్తుపెట్టుకుని నా పనులు చేసుకుంటూ వెళుతుంటాను.. అందుకు అనుగుణంగానే నా నిర్ణయాలు తీసుకుంటాను. నాన్నగారి విషయానికొస్తే ఆయన ముక్కుసూటి మనిషి.. విషయమేదైనా ఉంటే ముఖం మీదే చెప్పేస్తారు. వెనక మాట్లాడటం అనేది ఆయనకి అలవాటే లేదు. ఎదుటి వ్యక్తి తీరు నచ్చకపోతే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోతారేగానీ.. పక్కకి వెళ్లి మాట్లాడటం అనేది ఆయనకి తెలియదు. ఆయన నుంచి నేను కూడా అదే నేర్చుకున్నాను’ అని నందమూరి హీరో చెప్పాడు.

More News

అందువల్లే అల్లు అర్జున్ ఆ మాట అన్నారు: పూజా హెగ్డే

"త్రివిక్రమ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఆయన నుంచి నేను ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఏ సీన్ అయినా చాలా వివరంగా చెప్తారు.

‘సరిలేరు..’ చూసొస్తుండగా సంజనకు షాకిచ్చిన పోలీసులు

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మికమందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్‌ల‌తో హీరోయిన్‌ను వేధిస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, శ్రీనివాస క‌ల్యాణం, ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ 2 వంటి ప‌లు తెలుగు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరోయిన్ నందితా శ్వేత.

ఆ ద‌ర్శ‌కుడు స్క్రిప్ట్ గురించి మాట్లాడాల‌ని మీద చేయి వేశాడంటున్న హీరోయిన్

హాలీవుడ్‌లో ప్రారంభ‌మైన మీటూ ఉద్య‌మం బాలీవుడ్ అటు నుండి ద‌క్షిణాది సినిమా ప‌రిశ్ర‌మ‌ల‌కు పాకింది.

రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో ప‌వ‌న్‌

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ దాదాపు ఖరారైపోయింది. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ...