భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ పూర్తి చేసిన క‌మ‌ల్ హాస‌న్‌

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. 1996లో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన 'ఇండియ‌న్‌'కు ఇది సీక్వెల్. ఈ సీక్వెల్‌లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, సిద్ధార్థ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాకు షెడ్యూల్‌ను బోపాల్‌లోని ఓ ఫ్యాక్ట‌రీలో యాక్ష‌న్ సీన్‌ను చిత్రీక‌రించార‌ట‌.

పీట‌ర్ హెయిన్స్ నేతృత్వంలో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్‌ను చిత్రీక‌రించార‌ట‌. ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. క‌మ‌ల్ హాస‌న్ పుట్టిన‌రోజు వేడుక‌ల సెల‌బ్రేష‌న్స్ కోసం యూనిట్ గ్యాప్ తీసుకుంది. వెంట‌నే మ‌ధ్య ప్రదేశ్‌లోనే మ‌రికొన్ని కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ట‌.

ఈ సినిమా కోసం వ‌య‌సు మ‌ళ్లిన సేనాప‌తిగా క‌మ‌ల్ హాస‌న్ మ‌రోసారి తెర‌పై క‌న‌ప‌డ‌నున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌మ‌ల్ హాస‌న్ స‌ర‌స‌న న‌టిస్తుంటే.. సిద్ధార్థ్ జోడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన మార్ష‌ల్ ఆర్ట్స్‌ను నేర్చుకుంది. సినిమాలో క‌మ‌ల్ 90 ఏళ్ల వ్య‌క్తిగా క‌న‌ప‌డుతుంటే ర‌కుల్ 80 ఏళ్ల ముస‌లి బామ్మ‌గా క‌న‌ప‌డునుంది.

More News

రాశీఖ‌న్నాకు ఇదే తొలిసారి... ఎగ్జ‌యిట్ అవుతుంద‌ట‌

టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీఖ‌న్నా అందచందాల‌తో వెండితెర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. మంచి గాత్రంతోనూ పాటలు పాడి అంద‌రినీ అల‌రిస్తుంటుంది.

కొత్త లుక్ తో సర్ప్రైజ్ చేసిన శత్రు

'శత్రు' తెలుగులో ఉన్న టాలెంటెడ్ ఆర్టిస్టులలో ఒకరు. "కృష్ణ గాడి వీర ప్రేమ కథ " తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శత్రు

‘పవన్‌ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ’

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

'నిశ్శ‌బ్దం' టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గన్నాథ్‌

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు

ఇంకా విధుల్లో చేరని ‘ఎల్వీ’.. అసలేం జరుగుతోంది!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయిన సంగతి తెలిసిందే.