హిజాబ్ వివాదం.. తమిళనాడుకు పాకనివ్వకండి : కమల్‌హాసన్ సంచలన ట్వీట్

  • IndiaGlitz, [Wednesday,February 09 2022]

కర్ణాటకను హిజాబ్ వ్యవహారం కుదుపేస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకుంటుండటం, పరిస్ధితులు అదుపు తప్పుతుండటంతో సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ముఖ్యమంత్రి సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినీనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ స్పందించారు. వస్త్రధారణ వివాదం విద్యార్థుల మధ్య మత విద్వేషంగా మారుతోందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు తమిళనాడుకు పాకకూడదని... ఇలాంటి పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని కమల్ హాసన్ కోరారు.

అసలేం జరిగిందంటే:

నెల క్రితం ఉడుపిలోని ఓ పీయూ కళాశాలలో ఈ వివాదం పుట్టింది. హిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చారనే కారణంగా ఆరుగురు విద్యార్థినులను యాజమాన్యం తరగతి గదులకు అనుమతించలేదు. దీంతో వారు నాటి నుంచి కాలేజీకి వచ్చినా సాయంత్రం వరకు అక్కడే ఉండి వెళ్లిపోతుండేవారు. హిజాబ్‌ తీస్తేనే అనుమతిస్తామని కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పడంతో .. ఆ ఆరుగురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ వెంటనే ఇది వివాదానికి దారి తీసింది.

ఈ ఘటన తర్వాత బైందూరులో హిజాబ్‌ ధరించి కళాశాలకు వచ్చిన విద్యార్థినులను ప్రిన్సిపాల్‌ అడ్డుకోవడంతో పాటు గేట్‌ వేసేశారు. ఇక హిందూ సంఘాలు కూడా బరిలోకి దిగడంతో వివాదం తీవ్ర రూపు దాల్చింది. హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయ కండువాలు, తలపాగాలు ధరించి రావడం ప్రారంభించారు. సోమవారం వరకు కేవలం నిరసనలకే పరిమితమైన ఈ వ్యవహారం.. మంగళవారం హింసాత్మక రూపుదాల్చింది.

కొడగు జిల్లాలోని ఓ కళాశాలలో తన స్నేహితురాలికి బలవంతంగా కాషాయం శాలువా వేసేందుకు ప్రయత్నించిన విద్యార్థిపై ప్రత్యర్ధి వర్గం కత్తులతో దాడిచేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

More News

దేశాన్ని ఊపేస్తోన్న పుష్ప ఫీవర్.. రాజ్‌నాథ్ నోట ‘‘తగ్గేదే లే’’ డైలాగ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘‘పుష్ప’’.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. తెలంగాణలో రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు, వివరాలివే

తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాదక ద్రవ్యాలపై కీలక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

కొత్త ఇంట్లో ఆమెతో కలిసి అడుగుపెట్టిన షణ్ముఖ్.. ఫోటోలు వైరల్

యూట్యూబ్, టిక్‌టాక్‌ల ద్వారా యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

టికెట్ ధరల వివాద: ఎల్లుండి జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. చిరంజీవి వెంట ఎవరెవరు..?

రాష్ట్రంలో నెలకొన్న సినిమా టికెట్ల వివాదానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టాలనే ఆలోచనలో వుంది.

థర్డ్ వేవ్ ముగిసింది.. ఏ ఆంక్షలు లేవు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేయొచ్చు: తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిపోయినట్లేనని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.