'కంచె' వేయడానికి తేది నిర్ణయించారు

  • IndiaGlitz, [Tuesday,July 14 2015]

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తోన్న చిత్రమే 'కంచె'.

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న ఈ చిత్రం ఇటివలే (జూలై 6 2015) షూటింగ్ ను దిగ్విజయం గా పూర్తి చేసుకుంది. భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్ట ను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు.

ఈ చిత్రం నుండి ఒక ఫోటో ని హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా రిలీజ్ చేయగా, యువత నుండి మంచి స్పందన వచ్చింది. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్నిఅక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున విడుదల చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుంది.

More News

40 శాతం పూర్తి చేసుకున్న చరణ్ సినిమా

మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', సూపర్ 'డైరెక్టర్ 'శ్రీను వైట్ల' కాంబినేషన్ లో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి.

24న బాక్సాఫీస్ ను హీటెక్కిస్తుందా...?

పూనమ్ పాండే, మిలన్ ప్రధానపాత్రల్లో మనీషా ఆర్ట్స్అండ్ మీడియా ప్రై.లి. బ్యానర్ పై కిషోర్ రాఠి సమర్పణలో రూపొందిన చిత్రం ‘మాలిని అండ్ కో’.

చైతు పెద్ద మనసు

సినిమాల్లో హీరోయిజం చూపించడం ద్వారా కేవలం డబ్బు సంపాదించడమే పరమావధిగా సినీ నటీనటులు పనిచేస్తారనుకోవడం తప్పు అవుతుందని చాలా మంది ప్రూవ్ చేశారు.

రామ్ చరణ్ కొత్త చిత్రం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఆ రికార్డ్ సాధించే దిశగా బాహుబలి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ ‘బాహుబలి’ అంచనాలను మించుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది.