కంగ‌నా కొత్త వ్యాపారం

  • IndiaGlitz, [Wednesday,February 24 2021]

బాలీవుడ్ సెన్సేష‌న‌ల్ న‌టి, క్వీన్ కంగ‌నా ర‌నౌత్.. వ‌రుస సినిమాల‌తో బిజి బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే త్వ‌ర‌లోనే కంగ‌నా కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న‌ట్లు త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేసింది. వివ‌రాల్లోకి వెళితే త‌న స్వ‌స్థ‌లం అయిన మ‌నాలిలో ఓ కేఫ్‌, రెస్టారెంట్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు కంగనా తెలియ‌జేసింది. ‘‘నా కొత్త వెంచర్ నా కల. ఈ కలను త్వరలోనే నేరవేర్చుకోబోతున్నాను. ఈ విషయాన్ని మీ అంద‌రికీ చెప్ప‌డం ఆనందంగా ఉంది. ఈ ఆలోచ‌న‌తో మీ అంద‌రికీ మ‌రింత చేరువ అవుతాను. మ‌నాలిలో రెస్టారెంట్‌ను స్టార్ట్ చేయాల‌న్న నా క‌ల‌ను నేర‌వేర్చే క్ర‌మంలో అండగా నిల‌బ‌డుతున్న‌టీమ్‌కు ధ‌న్య‌వాదాలు’’ అని ట్వీట్ చేసింది కంగ‌నా ర‌నౌత్‌.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. కంగ‌నా ర‌నౌత్ ప్ర‌స్తుతం స్పైథ్రిల్ల‌ర్ థాక‌డ్‌లోనూ న‌టిస్తుంది. అలాగే తేజ‌స్ సినిమాలో ఫైల‌ట్‌గా న‌టిస్తుంది. ఇవి కాకుండా ఇప్ప‌టికే ఈ ఏడాదిలో జ‌య‌ల‌లిత బ‌యోపిక్ త‌లైవిలోనూ న‌టించింది. మ‌రికొన్ని ప్రాజెక్ట్‌ల‌ను సిద్ధం చేయిస్తోంది కంగ‌నా. ఇంత బిజీలోనూ కొత్త వ్యాప‌కాలు, వ్యాపారాల‌పై మ‌న‌సును ఎలా ల‌గ్నం చేస్తుందో కంగ‌నా అని అనుకుంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు.

More News

సెట్స్‌లోనే నిద్ర పోవ‌డానికి రెడీ: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’.

భీష్ముడు పాత్ర‌లో బాల‌కృష్ణ‌

టాలీవుడ్‌లో అన్ని ర‌కాల జోన‌ర్స్ మూవీలు చేసిన అతి కొద్ది మంది నేటి త‌రం అగ్ర క‌థానాయ‌కుల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు.

‘ఉప్పెన’ టీమ్ కు  మెగా గిఫ్ట్‌.. ఖ‌రీదెంతో తెలుసా?

కరోనా టైమ్‌లో వ‌స్తున్న సినిమాల్లో ఒక్కొక్క వారం ఒక్కో సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగానే మెప్పిస్తూ వ‌స్తుంది.

ఒక్క ట్వీట్‌తో రూ.1.10 లక్షల కోట్లు కోల్పోయిన మస్క్

ఒకే ఒక్క ట్వీట్ కొంపముంచింది. లక్ష కోట్ల రూపాయలకు పైగా పోయేలా చేసింది.  షాకింగ్‌గా అనిపించినప్పటికీ ఇది అక్షరాలా నిజం.

స్మార్ట్ ఫోన్ నుంచి కూడా కరోనా సోకే అవకాశం ఉందట..

కాదేదీ కరోనాకు అనర్హం అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చింది..