పవన్‌‌‌ను తిడతారా.. 2024లో అనుభవిస్తారు: జగన్‌కు కాపు సంక్షేమ సేన హెచ్చరిక

  • IndiaGlitz, [Wednesday,September 29 2021]

‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఊపేస్తున్నాయి. ఆ రోజు మొదలు ఇప్పటి వరకు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం భీకరంగా సాగుతోంది. ఏపీ మంత్రులందరూ మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడుతున్నారు. చిత్ర పరిశ్రమ, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ వంటి అంశాల్లో ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు.

మంత్రులంతా సన్నాసులు అంటూ పవన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలకు.. మంత్రులు సైతం అంతే ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యలపై సినీనటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేసి తన కుటుంబంపై అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నారని పోసాని ప్రెస్ మీట్ పెట్టి మరీ మరోసారి పవర్‌స్టార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అసలే ఉప్పు నిప్పుగా వున్న వ్యవహారంలో మరింత అగ్గిని రాజేసింది. నిన్న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పోసాని మీడియా సమాశం అయినవెంటనే కాపు సంక్షేమ సేన రంగంలోకి దిగింది.

కాపు మంత్రులు పవన్‌ను తిట్టడం వెనక ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించింది. పవన్‌ను అవమానించడం అంటే.. కాపు సమాజాన్ని అవమానపరచడమేనని స్పష్టం చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వీటి పర్యవసానాన్ని సీఎం జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య పేరిట ఓ లేఖ విడుదల చేశారు. ఇలాంటి ఉద్రిక్తత పరిస్ధితుల నేపథ్యంలో పవన్‌కల్యాణ్ బుధవారం మంగళగిరి వస్తుండటంతో ఏం జరుగుతుందోనని రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.

More News

‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్

అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో

'పుష్పక విమానం' నవంబర్ 12న విడుదల

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం" రిలీజ్ కు రెడీ అవుతోంది.

‘రిప‌బ్లిక్‌’ మూవీని డైరెక్ట‌ర్‌గా నా విజ‌న్‌తో తెర‌కెక్కించ‌డానికి హీరో సాయితేజ్ ఓ సైనికుడిలా స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డాడు - డైరెక్ట‌ర్ దేవాక‌ట్టా

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో

ఆన్‌లైన్‌లోకి సమంత... ఏం బాంబు పేలుస్తారో, ఈ రోజు సాయంత్రం రెడీగా ఉండండి..!

సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో, తెలుగు చిత్ర సీమలో ఎక్కడ చూసినా ఈమే పేరే గట్టిగా వినిపిస్తోంది.

'వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే' : పోసానికి తన స్టైల్లో కౌంటరిచ్చిన పవన్

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్‌ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌లో పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఏపీలోని వైఎస్ జగన్‌ సర్కార్‌‌పై చేసిన వ్యాఖ్యలు..