SVRangarao: ఎస్వీ రంగారావుపై వ్యాఖ్యలు : భగ్గుమన్న కాపునాడు, క్షమాపణలు చెప్పకుంటే .. బాలయ్యకు అల్టీమేటం

  • IndiaGlitz, [Wednesday,January 25 2023]

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కాపు నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. దివంగత మహానటుడు ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇందుకు ఈ నెల 25 వరకు డెడ్ లైన్ విధించింది. ఈ మేరకు మంగళవారం కాపునాడు ప్రకటన విడుదల చేసింది. రాజకీయాల్లో రాణించాలంటే అంత సులువు కాదని, చిరంజీవి సైతం విఫలమయ్యారని బాలయ్య సెటైర్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాల్లో విజయం తమకే సాధ్యమని.. మా బ్లడ్డు, బ్రీడు వేరని అన్న మాటలు కాపుల మనోభావాల్ని దెబ్బతీశాయని కాపునాడు పెద్దలు ఫైర్ అయ్యారు.

ఆ మాటలు కాపుల గుండెల్లో గునపాలు దించాయి:

జనసేనలో తిరిగే వారంతా.. అలగాజనమని, సంకరజాతి అంటూ చేసిన వ్యాఖ్యలు కాపుల గుండెల్లో గునపాలు దింపాయని ఆవేదన వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వున్న రంగా విగ్రహాల వద్ద కాపు సోదరులంతా నిరసనకు దిగుతారని కాపునాడు హెచ్చరించింది. గతంలో దేవ బ్రాహ్మణుల విషయంలో అన్న మాటలకు విచారం వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేసినట్లుగా .. ఎస్వీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. అలాగే టీడీపీ నుంచి బాలయ్యను పదేళ్ల పాటు బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌కు స్పందించిన పక్షంలో త్వరలో జరగనున్న నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

వేదికలపై నోరు జారుతోన్న బాలయ్య :

కాగా..ఇటీవల బహిరంగ వేదికలపై బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దేవ బ్రహ్మాణులపై బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం రేగడంతో బాలయ్య స్పందించారు. ఆ మాటలు దురదృష్టవశాత్తూ అన్నానని.. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. దేవ బ్రాహ్మణులు (దేవాంగులు)కు నాయకుడు రావణ బ్రహ్మా అని ఓ కార్యక్రమంలో బాలయ్య వ్యాఖ్యానించారు. అయితే దీనిపై దేవాంగులు భగ్గుమన్నారు. దేవ బ్రహ్మాణులకు దేవల మహర్షి గురువని అన్నారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. దేవాంగ కులానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాలయ్య స్పందించారు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. తన పొరపాటును మన్నించాలని.. సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల తనకు కలిగే ప్రయోజనం ఏముంటుందన్నారు.

More News

Akhil and Naga Chaitanya:అక్కినేని.. తొక్కినేని అంటూ వ్యాఖ్యలు : బాలయ్యకు కౌంటరిచ్చిన అఖిల్, చైతూ.. నాగార్జునే బ్యాలెన్స్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే.

Oscar Nominations 2023 : ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘‘ఆర్ఆర్ఆర్’’.. నాటు నాటుకు నామినేషన్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ అవార్డ్‌కు అడుగు దూరంలో నిలిచింది.

Karthika Deepam : తెలుగు సీరియల్ సత్తా చాటి, టీఆర్పీల మోత మోగించిన కార్తీక దీపానికి ఎండ్ కార్డ్

కార్తీక దీపం.. ఈ పేరు తెలియని తెలుగు వారు ముఖ్యంగా మహిళలు వుండరు.

జనవరి 26న 'సిందూరం'

నక్షలిజంపై ఎక్కుపెట్టిన బాణం సిందూరం !

Pawan kalyan : రేపు కొండగట్టుకు పవన్ కల్యాణ్.. టూర్ షెడ్యూల్ ఇదే ..!!

రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.