బేబీ బంప్‌తో షూటింగ్‌కు హాజరైన కరీనా

  • IndiaGlitz, [Wednesday,October 28 2020]

బేబీ బంప్‌తో బయటకు వచ్చేందుకు హీరోయిన్లు పెద్దగా ఇష్టపడరు. కానీ బాలీవుడ్ బ్యూటీ మాత్రం అవేమీ పట్టించుకోకుండా హ్యాపీగా బయటకు వెళుతోంది. ఆమె మరెవరో కాదు.. కరీనా కపూర్. ప్రస్తుతం కరీనా రెండోసారి తల్లి కాబోతోంది. కరోనా సమయంలో సాధారణ మహిళలే బయటకు వచ్చేందుకు భయపడుతుంటే కరీనా మాత్రం షూటింగ్‌లకు సైతం హాజరవుతోంది.

తాజాగా కరీనా ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొంది. దీనికోసం తన సోదరి కరిష్మా కపూర్‌తో కలిసి యాడ్ ఫిల్మ్ షూటింగ్‌కు హాజరైంది. తను రెండో సారి గర్భవతిని అవుతున్నానంటూ కరీనా ఆగస్టులోనే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అప్పటి నుంచి కూడా ఆమె అప్పుడప్పుడు బయట కనిపిస్తూనే ఉంది. తాజాగా యాడ్ ఫిల్మ్ షూటింగ్‌కు హాజరై.. దాని తాలుక బ్యాక్ స్టేజ్ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో కరీనా పోస్ట్ చేసింది. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

More News

పునర్జన్మల నేపథ్యంలో నాని

నేచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌కు ఓకే చెబుతున్నారు. ఇప్ప‌టికే శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ‘ట‌క్ జ‌గ‌దీష్’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

సరికొత్త రూపు సంతరించుకోనున్న ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రి సరికొత్త రూపు సంతరించుకోనుంది. దుర్గమ్మ భక్తులకు మౌలిక వసతులతో పాటు.. అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

అంత‌యితేనే ర‌ష్మిక ఓకే చెప్పిందా..?

క‌రోనా టైమ్‌లో సినీ ఇండ‌స్ట్రీ కుదేలైంది. నిర్మాత‌లంద‌రూ ప్రొడ‌క్ష‌న్ కాస్ట్‌ను త‌గ్గించుకునే ప‌నిలో భాగంగా, న‌టీన‌టులు, ఆర్టిస్టులంద‌రూ వారి రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌.

‘లూసిఫ‌ర్‌’లో ‘చిరు’ మార్పులు

ప్ర‌స్తుతం త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ను రీస్టార్ట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ప్లాన్స్ చేసుకుంటున్నారు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోందీ ఈ సినిమా.

చిరంజీవి సినిమాలో కీర్తి సురేష్.. ఏ పాత్రలోనంటే ?

మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీలో హీరోయిన్ కీర్తి సురేష్ ఛాన్స్ కొట్టేసింది. చిరు హీరోగా తమిళ్ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ను డైరెక్టర్ మెహర్ రమేష్ రీమేక్ చేయనున్న విషయం తెలిసిందే.