3 రోజుల్లోనే 11 కోట్లు కలెక్ట్ చేసిన కార్తీ, పివిపిల దీపావళి బ్లాక్ బస్టర్ 'కాష్మోరా'

  • IndiaGlitz, [Monday,October 31 2016]

పివిపి సినిమా బేనర్‌లో ప్రసాద్‌ వి.పొట్లూరి ఎన్నో భారీ చిత్రాలను నిర్మిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించిన క్షణం, ద్విభాషా చిత్రంగా రూపొందిన మల్టీస్టారర్‌ ఊపిరి చిత్రాలతో పివిపి సినిమా బేనర్‌కు 2016 సెన్సేషన్‌ ఇయర్‌ అయింది. మళ్ళీ ఇప్పుడు కార్తీ హీరోగా రూపొందిన 'కాష్మోరా' చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన పివిపి మరో బిగ్‌ సక్సెస్‌ను అందుకున్నారు. కార్తీ పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా రూపొందిన 'కాష్మోరా' రికార్డ్‌ కలెక్షన్స్‌ సాధిస్తోంది. 3 రోజుల్లోనే 11 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.
ఆవారా, యుగానికి ఒక్కడు, నాపేరు శివ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్న కార్తీ.. కింగ్‌ నాగార్జునతో కలిసి ద్విభాషా చిత్రంగా చేసిన మల్టీస్టారర్‌ 'ఊపిరి' పెద్ద హిట్‌ అయింది. కార్తీకి తెలుగులో కూడా ఫాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. 'కాష్మోరా'కు వచ్చిన భారీ ఓపెనింగ్సే దానికి నిదర్శనం. ఈ సినిమా కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సోలో సక్సెస్‌ కాబోతోంది.
డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌తో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించిన నయనతారకు 'కాష్మోరా'లో చేసిన క్యారెక్టర్‌ సినిమాకు మరో హైలైట్‌ అయింది. సినిమాలో ఆమె క్యారెక్టర్‌ కనిపించేది కాసేపే అయినా చాలా పవర్‌ఫుల్‌గా వుంటూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
'కాష్మోరా' సాధించిన బిగ్‌ సక్సెస్‌తో నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి చాలా హ్యాపీగా వున్నారు. ఈ సందర్భంగా పివిపి మాట్లాడుతూ - ''మా కాష్మోరా చిత్రం దీపావళి బ్లాక్‌బస్టర్‌గా నిలిచినందుకు చాలా హ్యాపీగా వుంది. చిన్న పిల్లలు, ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాగే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కార్తీకి, డైరెక్టర్‌ గోకుల్‌కి, టోటల్‌ టీమ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అన్నారు.
నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి డిఫరెంట్‌ కథాంశాలతో మరిన్ని చిత్రాలు ప్లాన్‌ చేస్తున్నారు. రానా దగ్గుబాటి హీరోగా పివిపి నిర్మిస్తున్న 'ఘాజి' చిత్రం ఫిబ్రవరి 24న విడుదల కాబోతోంది. అలాగే 'ఊపిరి' వంటి సూపర్‌హిట్‌ తర్వాత కింగ్‌ నాగార్జునతో మరో చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు పివిపి. ఓంకార్‌ దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'రాజుగారి గది2' చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం తర్వాత సూపర్‌స్టార్‌ మహేష్‌, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు పివిపి అధినేత ప్రసాద్‌ వి.పొట్లూరి.

More News

చైతన్య కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కి తీసుకువెళ్లే సినిమా సాహసం శ్వాసగా సాగిపో - గౌతమ్ మీనన్

అక్కినేని నాగచైతన్య,మంజిమ మోహన్ జంటగా నటించిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో.గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన సాహసం శ్వాసగా సాగిపో

పాపం...అఖిల్ సయేషా..!

అఖిల్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హీరోయిన్ సయేషా సైగల్.

సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ డేట్ ఫిక్స్..!

అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.

రాజ్ త‌రుణ్ కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త ఫ‌స్ట్ లుక్ రిలీజ్..!

రాజ్ త‌రుణ్ హీరోగా దొంగాట ఫేమ్ వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌. ఈ చిత్రాన్ని ఎ.కె ఎంట‌ర్ టైన్మెంట్స్  సంస్థ నిర్మిస్తుంది. దీపావ‌ళి సంద‌ర్భంగా కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసారు.

తాత చెప్పిన ఆ మాటే నరుడా డోనరుడా సినిమా తీసేలా చేసింది - సుమంత్

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం నరుడా డోనరుడా. ఈ చిత్రంలో సుమంత్ సరసన పల్లవి సుభాష్ నటించింది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.