కార్తీ, రకుల్ జంటగా ఆదిత్య మ్యూజిక్ ఉమేశ్ గుప్తా సినిమా 'ఖాకి - ది పవర్ ఆఫ్ పోలీస్'

  • IndiaGlitz, [Tuesday,September 12 2017]

రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌'. ఈ సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాల సంగీతాన్ని విడుదల చేసి సంగీత ప్రపంచంలో, శ్రోతల మదిలో సముచిత స్థానాన్ని సంపాదించుకుందీ సంస్థ. రెండున్నర దశాబ్దాలు సినిమా రంగాన్ని అతి దగ్గరగా పరిశీలించిన అనుభవంతో ఆదిత్య మ్యూజిక్‌' ఉమేశ్‌గుప్తా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. అందులో భాగంగా కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు'ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

ఈ సినిమాను తెలుగులో ఖాకి'గా విడుదల చేస్తున్నారు ఉమేశ్‌ గుప్తా. ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌'... అనేది ఉపశీర్షిక. సూపర్‌ హిట్‌ తమిళ సినిమా చతురంగ వేటై్ట' ఫేమ్‌ హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అతి త్వరలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్‌' సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ– ఇందులో కార్తీ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. లుక్స్, ఫిజిక్‌ పరంగా ఆయన చాలా కేర్‌ తీసుకున్నారు. 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు హెచ్‌. వినోద్‌ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. కథ వినగానే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించాలని సినిమా రైట్స్‌ తీసుకున్నా. తెలుగులో రన్‌ రాజా రన్‌', జిల్‌', బాబు బంగారం', హైపర్‌' తదితర చిత్రాలకు అద్భుతమైన సంగీతమందించిన జిబ్రాన్‌ ఈ సినిమాకూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. అతి త్వరలో టీజర్ ను, పాటలను , చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.

అభిమన్యు సింగ్, బోస్‌ వెంకట్, స్కార్లెట్‌ మెల్లిష్‌ విల్సన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, ఆర్ట్‌: కె. ఖదీర్, ఎడిటర్‌: శివనందీశ్వరన్, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్, డ్యాన్స్‌: బృంద, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

More News

'తెలుగు సినిమా వరల్డ్ రికార్డ్స్'లో తుమ్మలపల్లి రామసత్యనారాయణకు స్థానం!!

సుమన్-రవళి కాంబినేషన్ లో 2004లో 'ఎస్ పి సింహా'చిత్రంతో నిర్మాతగా మారి..

'జై లవకుశ' తో ఎన్టీఆర్ రికార్డులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్న చిత్రం'జై లవకుశ'.కె.ఎస్.రవీంద్ర(బాబీ)దర్శకుడు.

విశాల్ 'విల‌న్‌' గా వ‌చ్చేస్తున్నాడు..

తెలుగు, త‌మిళ చిత్రాలతో త‌న కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న హీరో విశాల్‌. ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా న‌టించ‌బోతున్నాడు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తున్న చిత్రం విల‌న్‌లో విశాల్ విల‌న్‌గా క‌న‌ప‌డ‌నున్నాడ‌నేది తెలిసిందే.

'జవాన్' రిలీజ్ డేట్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా బివిఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'జవాన్'.

కుంభకోణంలో బాలకృష్ణ 102 సినిమా షూటింగ్

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై