ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌ను: కార్తి

  • IndiaGlitz, [Tuesday,March 26 2019]

హీరో సూర్య త‌మ్ముడు కార్తి ఇప్పుడు భాగ్యరాజ్ క‌న్న‌న్ సినిమాలో ర‌ష్మిక‌తో న‌టిస్తున్నాడు. దీని త‌ర్వాత లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఖైది' సినిమా చేయ‌బోతున్నాడు.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సినిమాకు చెందిన కొంత మంది ఆర్టిస్టులు ఏదో ఒక పార్టీ త‌ర‌పున ప్ర‌చారం చేస్తుంటారు. వీరి కేట‌గిరిలోకి కార్తిని చేరుస్తూ రీసెంట్‌గా సోష‌ల్ మీడియాలో.. కార్తి పాలిటిక్స్‌లో బిజీ కానున్నారని.. ఓ పార్టీ త‌ర‌పున ప్రచారం చేయ‌బోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై కార్తి స్పందించారు. తాను ఎన్నిక‌ల్లో ఏ పార్టీ త‌ర‌పునా ప్ర‌చారం చేయడం లేదంటూ.. ఓట‌రుగా మాత్ర‌మే త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తానంటూ ప్ర‌క‌టించాడు.