నిర్మాతగా కత్రినా కైఫ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్స్ నిర్మాతలుగా మారుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో అనుష్క శర్మ, దీపికా పదుకొనె వంటి స్టార్ హీరోయిన్స్ ప్రొడక్షన్ వ్యవహారాలను చూస్తున్నవారే. ఇప్పుడు ఈ లిస్టులో కత్రినా కైఫ్ కూడా చేరనుంది. ఫ్రెంచ్ చిత్రం `హీ లవ్స్ మీ హీ లవ్స్ మీ నాట్` సినిమాను రీమేక్ చేయడానికి కత్రినా ఆసక్తిగా ఉన్నారట. `ప్రాజెక్ట్ చాలా ఎగ్జయిటింగ్గా అనిపించింది. దాంతో హక్కులను తీసుకున్నాం. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ ఏడాదినే సినిమాను సెట్స్కు తీసుకెళతాం` అంటూ కత్రినా చెప్పుకొచ్చారు. సల్మాన్ఖాన్తో ఈమె నటించిన `భారత్` చిత్రం ఈ జూన్ 5న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.