Kavitha:సుప్రీంకోర్టులో కవితకు చుక్కెదురు.. బెయిల్ ఇవ్వడం కుదరదన్న ధర్మాసనం..

  • IndiaGlitz, [Friday,March 22 2024]

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని.. వెంటనే బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రస్తుతం బెయిల్ ఇవ్వలేమని.. ఇందుకోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. అలాగే కవిత బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.

మరోవైపు పిటిషన్‌లో కవిత లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు ధర్మాసనం అంగీకరించింది. ఈ మేరకు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించి పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలను ఇప్పటికే దాఖలైన విజయ్ మదన్ లాల్ కేసుకు జత చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విచారణలో భాగంగా బెయిల్ తాము ఇవ్వలేమని.. ఎవరైనా సరే కింది కోర్టును మొదట ఆశ్రయించాల్సిందేనని స్పష్టం చేసింది.

కాగా లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న కవితను మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈ నెల 15న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దీంతో ఐదు రోజుల పాటు కవితను అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ట్రయిల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ ఏం జరగనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే ఈ కేసులోనే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొడంతో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. మొత్తానికి ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా లిక్కర్ కేసు భారీ ప్రకంపనలు సృష్టిస్తోంది.

More News

Kejriwal:కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఢిల్లీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు..

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది.

Drug Container:వైజాగ్‌లో దొరికిన డ్రగ్స్ కంటైనర్‌తో టీడీపీ నేతలకు లింకులు..?

ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ దొరకడం కలకలం రేపింది. బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన ఓ కంటెనైర్‌లో

TDP:టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల

టీడీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Tamilisai:ఎంపీగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ ఎక్కడి నుంచంటే..?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఎంపీగా పోటీ చేసే స్థానం ఖరారైంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో

Manchu Manoj:నా మాటలను తప్పుగా అపార్థం చేసుకున్నారు.. మంచు మనోజ్ క్లారిటీ..

తిరుపతిలో జరిగిన మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకల్లో మంచు మనోజ్(Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వైరల్ అయిన సంగతి తెలిసిందే.