వైఎస్ జగన్కు సీఎం కేసీఆర్ ఫోన్...
- IndiaGlitz, [Thursday,May 23 2019]
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలు వైఎస్ జగన్ గెలుపు అనంతరం ఫలితాలు వీక్షించిన కేసీఆర్.. జగన్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయం సాధించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన కేసీఆర్, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్షించారు.