close
Choose your channels

ట్రంప్‌తో విందుకు కేసీఆర్.. ప్రత్యేక ఆహ్వానం!

Saturday, February 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ట్రంప్‌తో విందుకు కేసీఆర్.. ప్రత్యేక ఆహ్వానం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ నెల 25న విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు హాజరు కావాలంటూ ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందాయి. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఉండటం విశేషమని చెప్పుకోవచ్చు. ఈ విందు కేవలం 90 నుంచి 95 మంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానాలు అందటం ఆసక్తి కలిగించే అంశం కాగా.. అందులో కేసీఆర్‌కు కూడా ఆహ్వానం రావడం విశేషమని చెప్పుకోవచ్చు.

వాస్తవానికి ట్రంప్ కుమార్తె ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు కేసీఆర్ సర్కార్ గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికి అన్నీ దగ్గరుండి మరీ చూసుకున్నారు. కాగా.. ట్రంప్ కుమార్తె కూడా ఇప్పుడు భారత్‌కు వస్తున్నారు. ఇవాంకను కలవడం రెండోసారి కాగా.. ట్రంప్‌తో మాత్రం మొదటిసారి కేసీఆర్ కలవబోతున్నారన్న మాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.