కేసీఆర్‌కు యశోదాలో వైద్య పరీక్షలు..

  • IndiaGlitz, [Thursday,January 07 2021]

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్‌ ఊపిరితిత్తుల్లో మంట కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం.వి. రావు, శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్ సాగర్ రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాగా.. ఎం.ఆర్.ఐ, సిటి స్కాన్ లాంటి పరీక్షలు అవసరం కావడంతో.. వాటిని గురువారం మధ్యాహ్నం యశోదా ఆసుపత్రిలో నిర్వహించనున్నారు.

కాగా.. ఇటీవల ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన నాటి నుంచే కేసీఆర్ అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల గడ్కరీతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ పాల్గొనలేదు. అయితే ఆయన కోలుకున్నాక కేసీఆర్‌ను క‌లుస్తానంటూ గ‌డ్క‌రీ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించ‌టంతో కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నార‌న్న విష‌యం బయ‌ట‌కు వచ్చింది. అయితే తాజాగా కేసీఆర్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించడం ఆయన అనారోగ్యం పాలయ్యారన్న ప్రచారానికి బలం చేకూరుతోంది. మొత్తానికి నేడు యశోదా వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించనున్నారు.

More News

ప్రభాస్ కోసం ఆ బాలీవుడ్ స్టార్ దిగుతున్నాడా..?

ప్ర‌భాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన త‌ర్వాత ఆయ‌న కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

ర‌కుల్ ఆ స్టార్‌ను బుట్ట‌లో వేసుకుందా?

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్.

మంత్రి సబిత కుమారుడి పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం..

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మూడో కుమారుడైన కళ్యాణ్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆదిలాబాద్ టౌన్‌కి చెందిన ప్రవీణ్ కుమార్

మొదటి మహిళ హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ ప్రమాణం..

తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా హిమా కోహ్లీ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్‌లో చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీతో గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు.

రాముడిగా ప్రభాస్‌నే ఊహించుకున్నా: డైరెక్టర్ ఓం రౌత్

‘బాహుబలి’ సినిమా తరువాతి నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా మూవీలపైనే ఎంచుకుంటున్న విషయం తెలిసిందే.