డిసెంబ‌ర్ లో విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోన్న 'కేడీ నెం-1'

  • IndiaGlitz, [Saturday,November 10 2018]

‘శంభో శంకర’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా చిత్రం ‘కేడీ నెం'1’. జాని దర్శకత్వంలో డి.గిరీష్‌ బాబు నిర్మిస్తున్నారు. ఖుషీ గడ్వీ, గుర్లిన్‌ చోప్రా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసిన డిసెంబ‌ర్ లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డి.గిరీష్‌ బాబు మాట్లాడుతూ..‘‘ 'శంభో శంక‌ర‌' చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా జాని దర్శకత్వంలో ‘కేడీ నెం'1’ అనే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాను. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. దర్శకుడు జాని అద్భుతంగా తెరకెక్కించారు. పూర్తి స్థాయి యాక్ష‌న్ ఫిలిం. టీమ్ అంద‌రి స‌హ‌కారంతో సినిమాను అనుకున్న విధంగా రూపొందించ‌గ‌లిగాం'' అన్నారు.

ద‌ర్శ‌కుడు జానీ మాట్లాడుతూ... ''కే.వి.వి. స‌త్యనారాయ‌ణ‌గారు, వార‌బ్బాయి వేణుగారి స‌పోర్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. 22 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. డైర‌క్ట‌ర్ గా ఇది తొలి సినిమా. న‌న్ను న‌మ్మి ఈ అవ‌కాశం క‌ల్పించిన నిర్మాత గిరీష్ గారికీ, హీరో శంక‌ర్ కు నా ధ‌న్య‌వాదాలు. శంక‌ర్ కామెడీ మాత్ర‌మే కాదు యాక్ష‌న్ కూడా చేయ‌గ‌ల‌డ‌ని మా సినిమా ద్వారా తెలుస్తుంది. నేను డిజైన్ చేసుకున్న క్యార‌క్ట‌ర్ కి త‌గ్గ‌ట్టుగా శంక‌ర్ అద్భుతంగా చేశాడు '' అని అన్నారు.

ముఖుల్ దేవ్‌, జ‌హీర్ ఖాన్‌, తాగు బోతు ర‌మేష్‌, గ‌బ్బ‌ర్ సింగ్ టీమ్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌; కెమెరాః ముజీర్‌; కొరియోగ్రాఫ‌ర్ః శివ శంక‌ర్ మాస్ట‌ర్‌; ఫైట్స్ః కృష్ణం రాజు; ప‌్రొడ్యూస‌ర్ః డి.గిరీష్ బాబు; స‌్టోరీ- స్క్రీన్ ప్లే-డైలాగ్స్-ద‌ర్శ‌క‌త్వంః జాని.

More News

సదరన్ స్టార్ అల్లు అర్జున్ కి గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన మల్లూవుడ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కేరళ అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈరోజు కేరళలోని అలప్పుఝా వద్ద ఉన్న పున్నామ్ద సరస్సులో

అందంగా ఉన్న‌వాళ్లు న‌టించ‌లేర‌న్నారు! - హీరో వ‌సంత్‌

లిమిటెడ్ బడ్జెట్‌తో కంటెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన చిత్రం 'కర్త కర్మ క్రియ'. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం యువ ద‌ర్శ‌కుడు నాగు గ‌వ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

నా జీవితంలో కొత్త మలుపు 'శరభ' చిత్రం: జయప్రద

ఆకాష్ కుమార్, మిస్టి చక్రవర్తి జంటగా సీనియర్ నటి జయప్రద ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం “శరభ”. ఎన్‌.నరసింహరావు దర్శకత్వం వహించగా

'గూఢచారి' కంటిన్యూ అవుతాడు!

అంత త‌క్కువ బ‌డ్జెట్లో ఆ క్వాలిటీ ఎలా సాధ్య‌మైంది..? 'గూఢ‌చారి' సినిమాను చూసిన వారంద‌రిదీ ఒకే ప్ర‌శ్న‌. అయినా స‌రైనా ప్ర‌ణాళిక‌తో,

'బాహుబ‌లి' ముందు...అక్క‌డ మొద‌ల‌వుతుంది!

బాహుబ‌లి సినిమాను అంత తేలిగ్గా ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. క‌ల్పిత గాథ అయిన‌ప్ప‌టికీ అప్పుడెప్పుడో నిజంగానే జ‌రిగిందా అన్నంత ఘ‌నంగా తెర‌కెక్కించారు బాహుబ‌లి.