రజినీకాంత్ తో మహానటి
Send us your feedback to audioarticles@vaarta.com
తలైవా, సూపర్స్టార్ రజినీకాంత్ 168వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రజినీకాంత్తో నటించబోయే హీరోయిన్ ఎవరా? అనే దానిపై సోషల్ మీడియాలో పలు వార్తలు వినపడుతూ వచ్చాయి. మంజు వారియర్, కీర్తిసురేష్, ఖుష్బూ, మీనా తదితరుల పేర్లు వినపడింది.
తాజాగా రజినీకాంత్ సరసన నటించబోయే హీరోయిన్ కీర్తిసురేష్ అని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఖరారు చేసింది. తలైవాతో చిత్రంలో కీర్తి హీరోయిన్గా నటిస్తుందా? లేక మరేదైనా కీలక పాత్రలో నటిస్తుందా? అనే సంగతి తెలియదు కానీ.. ఆమె నటించడమైతే పక్కా అయ్యింది. శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చితానికి ‘వ్యూహం’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెలఖారున సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్'. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇందులో రజినీకాంత ఆదిత్య అరుణాచలం అనే పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో కూడా విడుదలైంది. త్వరలోనే రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఆయన తన కమిట్మెంట్స్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.