రజినీకాంత్‌ తో మహానటి

  • IndiaGlitz, [Monday,December 09 2019]

తలైవా, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ 168వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రజినీకాంత్‌తో నటించబోయే హీరోయిన్‌ ఎవరా? అనే దానిపై సోషల్‌ మీడియాలో పలు వార్తలు వినపడుతూ వచ్చాయి. మంజు వారియర్‌, కీర్తిసురేష్‌, ఖుష్బూ, మీనా తదితరుల పేర్లు వినపడింది.

తాజాగా రజినీకాంత్‌ సరసన నటించబోయే హీరోయిన్‌ కీర్తిసురేష్‌ అని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఖరారు చేసింది. తలైవాతో చిత్రంలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తుందా? లేక మరేదైనా కీలక పాత్రలో నటిస్తుందా? అనే సంగతి తెలియదు కానీ.. ఆమె నటించడమైతే పక్కా అయ్యింది. శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ చితానికి ‘వ్యూహం’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ఈ నెలఖారున సెట్స్‌ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం రజినీకాంత్‌ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దర్బార్‌'. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇందులో రజినీకాంత ఆదిత్య అరుణాచలం అనే పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో కూడా విడుదలైంది. త్వరలోనే రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నాడనే వార్తలు వినపడుతున్న నేపథ్యంలో ఆయన తన కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

More News

రోజా వ్యాఖ్యలపై పవన్ రియాక్ట్ అవుతాడా!?

ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి చెమ్డాలు ఊడేలా రెండు బెత్తం దెబ్బలు కొట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కష్టమొస్తే ‘గన్’ కంటే ముందే ‘జగన్’ రావాలి.. రోజా రెక్వెస్ట్!

ఆడపిల్లకు కన్నీరొస్తే ‘గన్’ కంటే ముందు వైఎస్ జగన్ వస్తాడనే నమ్మకమని ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.

అఘాయిత్యాల‌కు పాల్పడితే ఉరిశిక్షే.. తేల్చేసిన జగన్!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ సంఘటన తర్వాత ప్రభుత్వాల్లో చాలా మార్పులు సంభవిస్తున్నాయి.

నాకున్నది ఒక్క భార్యే.. కొందరేమో నాలుగో పెళ్లి కోసం తాపత్రయం!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’పై గత పదిరోజులుగా చర్చ జరుగుతూనే ఉంది.

శివ 143 ఫస్ట్ లుక్ & ట్రైలర్ విడుదల

ఈ సందర్భంగా నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ... నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నుండి మొదటి ఓనమాలు దిద్దించింది మా అన్నయ్య కళ్యాణ్ గారు..