close
Choose your channels

కీర్తిసురేష్ ఎమోష‌నల్ పోస్ట్‌

Sunday, November 17, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కీర్తిసురేష్ ఎమోష‌నల్ పోస్ట్‌

ద‌క్షిణాది సినిమాల‌తో ఆక‌ట్టుకున్న హీరోయిన్ కీర్తిసురేశ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనూ న‌టిస్తుంది. ఈరోజు కీర్తిసురేశ్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోష‌న‌ల్ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ఇది ఆమె కెరీర్‌కు సంబంధించిన పోస్ట్ కావ‌డం విశేషం. ``ఆరేళ్ల క్రితం న‌టిగా ఇదేరోజున జ‌న్మించాను. న‌న్ను న‌టిగా అంగీక‌రించి నాపై ప్రేమాభిమానాల‌ను చూపిస్తున్నందుకు థ్యాంక్స్‌. ఎన్నో డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నాను. నేను ఈ స్థాయికి చేరుకోవ‌డానికి నా కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులే కార‌ణం. అంద‌రికీ ధ‌న్య‌వాద‌లు. మీమీ సీట్ల‌లో పాప్ కార్న్ తింటూ కూర్చోండి. మ‌నం మ‌రింత దూరం ప్ర‌యాణించాల్సి ఉంది`` అన్నారు కీర్తి సురేశ్‌.

2013లో మ‌ల‌యాళ చిత్రం `గీతాంజ‌లి` ద్వారా సినీ రంగ ప్ర‌వేశం చేవారు. త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించారు. తెలుగులో `నేను శైల‌జ‌` చిత్రంతో రంగ ప్ర‌వేశం చేసిన కీర్తిసురేష్‌కి తెలుగు, త‌మిళంలో రూపొందిన `మ‌హాన‌టి`తో జాతీయ‌స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. ఉత్త‌మ‌న‌టిగా అవార్డును సొంతం చేసుకుంది. ఇప్పుడు ప‌లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌తో పాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ న‌టిస్తుంది కీర్తి సురేశ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.