కీ్ర్తి సురేశ్ తొలి సినిమా.. నిర్మాత‌ల మ‌ధ్య తొలి వివాదం

  • IndiaGlitz, [Thursday,October 01 2020]

జాతీయ ఉత్త‌మ‌న‌టిగా ‘మ‌హాన‌టి’ చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్న కీర్తిసురేశ్ తొలి చిత్రం నవీన్ విజయ్‌కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఐనా నువ్వంటే ఇష్టం’. ఈ సినిమా హ‌క్కుల విష‌యంలో నిర్మాత‌లు చంటి అడ్డాల‌, న‌ట్టి కుమార్ మ‌ధ్య వివాదం పెర‌గుతోంది. సినిమా హక్కుల విష‌యంలో త‌న‌కు రావాల్సిన డ‌బ్బులు అంద‌లేద‌ని న‌ట్టికుమార్‌పై చంటి అడ్డాల బంజారా హిల్స్ పోలీస్ స్టేష‌న్‌తో పాటు ఫిలించాంబ‌ర్‌లోనూ ఫిర్యాదు చేసిన‌ట్లు తెలిపారు. సినిమా మ‌ధ్య వివాదాన్నినిర్మాత చంటి అడ్డాల వివ‌రించారు. న‌ట్టికుమార్ త‌న ప‌లుకుబ‌డితో ఫిల్మ్ ఛాంబ‌ర్‌ను మేనేజ్ చేశాడ‌ని చంటి అడ్డాల ఆరోపించారు.

నిర్మాత‌గా త‌న పేరుని తొలగించి న‌ట్టికుమార్ పేరుని వేసుకున్నాడ‌ని చంటి అడ్డాల తెలిపారు. అంతే కాకుండా త‌న సినిమాగా చెప్పుకుంటున్నాడ‌ని కూడా అన్నారు. కీర్తిసురేశ్ సినిమాల‌కు గ‌తంలో కంటే ఇప్పుడు మంచి ఆద‌ర‌ణ ఉండ‌టంతో, నట్టికుమార్ త‌న‌ను మోసం చేశాడ‌ని చంటి అడ్డాల అన్నారు. అయితే నిర్మాత న‌ట్టికుమార్ దీనిపై స్పందిస్తూ చంటి అడ్డాల ఈ సినిమాను త‌న‌తో పాటు మ‌రో ముగ్గురుకి కూడా విక్ర‌యించార‌ని, ఆ విష‌యంలో తాను పోలీస్ కేసుకూడా పెట్టాన‌ని తెలిపారు.
 

More News

ఇట‌లీ బ‌య‌లుదేరిన ప్ర‌భాస్‌

బాహుబ‌లి’ త‌ర్వాత ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌.. ఇప్పుడు ఆ రేంజ్‌లోనే సినిమాలు చేస్తున్నారు.

సోషల్ మీడియాను దున్నేస్తున్న ‘నాది నక్కిలీసు గొలుసు’..

‘నాది నక్కిలీసు గొలుసు’ సాంగ్ వినని వారు ఎవరైనా ఉన్నారా? అని ఇప్పుడు అడగటం ఫూలిష్ నెస్ అవుతుందేమో..

ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో ఒక్క సెప్టెంబర్‌లోనే 40 శాతం కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. సెప్టెంబర్ నెలలో కరోనా మరింత తీవ్ర రూపం దాల్చింది.

జ‌యం' ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల  'బోగ‌న్‌' ట్రైల‌ర్ విడుద‌ల‌

ఇటీవ‌ల 'బోగ‌న్' చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది.

యాక్షన్‌తో ప్రారంభం కానున్న ‘పుష్ప‌’

స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘ఆర్య‌, ఆర్య 2’ త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం ‘పుష్ప‌’.