తెలుగులో కీర్తి సురేష్ ఆ హీరోతో నటిస్తుందా..

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]
నేను శైల‌జ సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన హీరోయిన్ కీర్తి సురేష్. తొలి చిత్రంతోనే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న కీర్తి సురేష్ కి ఆత‌ర్వాత స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. మ‌హేష్ - మురుగుదాస్ సినిమాలో, రామ్ చ‌ర‌ణ్ - సురేంద‌ర్ రెడ్డిల త‌ని ఓరువ‌న్ రీమేక్ లో హీరోయిన్ గా కీర్తి సురేష్ అవ‌కాశం ద‌క్కించుకుంది అంటూ ప్ర‌చారం జ‌రిగింది.
ఇంకేముంది కీర్తి సురేష్ తెలుగులో టాప్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు. కానీ అవ‌న్నీకేవ‌లం వార్త‌లుగా మిగిలిపోయాయి. ఇదిలా ఉంటే...తాజాగా కీర్తి సురేష్ తెలుగులో హీరో సిద్దార్ధ్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ట‌. ఈ చిత్రాన్ని గుంటూరు టాకీస్ తో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కించ‌నున్నారు. ఈ సినిమా త‌ర్వాత అయినా కీర్తి సురేష్ కి తెలుగులో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌స్తుందేమో చూడాలి.

More News

'కబాలి' ఆలస్యమవుతాడా?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అందులో ఇకటి పా రంజిత్ దర్శకత్వంలో కబాలి చిత్రం కాగా రెండో చిత్రం శంకర్ దర్శకత్వంలో 2.0 సీక్వెల్ ఆఫ్ రోబో. అయితే ఈ రెండు చిత్రాల్లో కబాలిని మే 1న రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నారు.

సర్దార్ ను ప్రేక్షకుడు అంతసేపు భరిస్తాడా?

ఇప్పుడు ప్రేక్షకుల ట్రెండ్ కు అనుగుణంగానే సినిమాల రన్ టైం కూడా డిసైడ్ అవుతుంది. ఒకప్పుడు సినిమా మూడు నాలుగు గంటల నిడివి ఉండేది. ఇప్పుడది కాస్తా రెండు గంటలకు చేరింది. రెండు గంటలు దాటిందంటేనే ప్రేక్షకుడు సినిమా లెంగ్త్ ఎక్కువైందని భావిస్తున్నాడు.

రాజ‌మండ్రిలో ఈరోజు నుంచే ప‌వ‌న్ ఫ్యాన్స్ సంద‌డి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఈనెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రి ప్లాన్స్ లో వాళ్లు ఉన్నారు.

దోషం పోయేందుకు పూజ‌లు చేస్తున్న నిత్యా..

టాలీవుడ్ పాపుల‌ర్ హీరోయిన్ నిత్యామీన‌న్ ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న 24 మూవీలో న‌టిస్తుంది. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ మూవీలో న‌టిస్తుంది. అయితే నిత్యామీన‌న్ దేవుడిని బాగా న‌మ్ముతుంది అనుకుంట‌.

పోలీసోడు ఆడియో రిలీజ్ వాయిదా

విజయ్, సమంత, ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన త‌మిళ చిత్రం తెరి. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పోలీసోడు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.