Amala Paul:గుడిలోకి అడుగుపెట్టనివ్వని పూజారులు.. అమలాపాల్‌కు ఘోర అవమానం, వివక్ష పోలేదంటూ హీరోయిన్ ఆవేదన

  • IndiaGlitz, [Wednesday,January 18 2023]

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలుస్తున్నా.. ఇంకా దేశంలో మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. నరబలులు, క్షుద్రపూజలు, మంత్రాలు అనే వార్తలు నిత్యం ఏదో మూల వినిపిస్తూనే వుంటాయి. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత ఎందరో మహనీయులు కులాలు, మతాల మధ్య వున్న అంతరాలను తగ్గించేందుకు .. అంటరానితనాన్ని నివారించేందుకు ఎంతో కృషి చేశారు. కానీ నేటికీ భారతీయ సమాజంలో ఈ అంతరాలు తగ్గడం లేదు. ఇక.. ఇప్పటికీ మన దేశంలోని కొన్ని హిందూ దేవాలయాలలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఇతర మతస్తులను దేవాలయాల్లోకి అనుమతించకపోడం ఇందులో ప్రధానమైనది. పూజారులు, దేవాలయాల కమిటీలు ఈ నియమాలు కఠినంగా అమలు చేస్తున్నాయి.

విజిస్టర్ రిజిస్టర్‌లో అమలాపాల్ ఆవేదన:

అయితే పలువురు ప్రముఖులు కూడా ఆలయ ప్రవేశం విషయంలో అవమానాలను ఎదుర్కొన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో స్టార్ హీరోయిన్ అమలాపాల్ చేరారు. స్వతహాగా క్రైస్తవ మతస్తురాలైన ఆమెకు కేరళలోని ఓ ఆలయంలోకి ఎంట్రీ దొరకలేదు. ఎర్నాకులంలోని తిరువైరానికులం మహాదేవ ఆలయంలోకి అమలాపాల్ ప్రవేశానికి అక్కడి పూజారులు అనుమతించలేదు. ఈ ఆలయంలోకి కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశం వుంటుందని, మిమ్మల్ని అనుమతించేది లేదని పూజారులు స్పష్టం చేశారు. తనకు జరిగిన అవమానాన్ని అమలాపాల్ ఆలయంలోని విజిటర్స్ రిజిస్టర్‌లో తెలియజేశారు.

2023లోనూ ఇలాంటి వివక్షలేంటీ :

తనను ఆలయంలోకి అనుమతించకపోయినప్పటికీ.. మనసులోనే అమ్మవారిని ప్రార్ధించానని చెప్పారు. 2023లలోనూ ఇంకా సమాజంలో మతపరమైన వివక్ష కొనసాగుతోందంటే నమ్మశక్యంగా లేదంటూ అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం నుంచి ఈ వివక్ష పోవాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు అమలాపాల్‌కు దేవాలయంలో జరిగిన అవమానం విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు ఆమెకు మద్ధతుగా పోస్ట్‌లు పెడుతున్నారు.

More News

Bandi Sanjay:తోటి విద్యార్ధిపై దాడి, ముదురుతోన్న బండి సంజయ్ కుమారుడి వివాదం.. వెలుగులోకి మరో వీడియో

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తోటి విద్యార్ధిని కొట్టిన వీడియో వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pawan kalyan - ali : పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్ధం.. కమెడియన్ అలీ సంచలన ప్రకటన

మెగా ఫ్యామిలీకి ముఖ్యంగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు కమెడియన్ అలీ అత్యంత సన్నిహితుడు. పవన్ సినిమా చేస్తుంటే..

Panja Vaishnav Tej :పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రచార చిత్రం విడుదల

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో

Shaakuntalam:ఫిబ్ర‌వ‌రి 17న ‘శాకుంతలం’ రిలీజ్‌

అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందించే  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఆవిష్క‌రిస్తోన్న

చంద్రబాబు సభలో తొక్కిసలాట .. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్ధిక సాయం : మన్నవ మోహనకృష్ణ

న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరులో జరిగిన చంద్రన్న కానుక, ఎన్టీఆర్ జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో