close
Choose your channels

జ‌పాన్‌లో 'కేస‌రి'

Tuesday, June 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌పాన్‌లో కేస‌రి

అక్ష‌య్‌కుమార్ హీరోగా అనురాగ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `కేస‌రి`. ఈ ఏడాది మార్చి 21న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద విజ‌యాన్ని అందుకుంది. ఇప్పుడు కేస‌రి విదేశాల్లో కూడా విజ‌య ప‌తాకాన్ని ఎగ‌రేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ చిత్రాన్ని జ‌పాన్‌లో ఆగస్ట్ 16న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ విష‌యాన్ని హీరో అక్ష‌య్‌కుమార్ తెలియ‌జేశారు. సారంగి అనే ప్రాంతంలో 21 మంది ధైర్య‌వంతులైన సిక్కు సైనికులు, 10,000 చొర‌బాటుల దారుల‌తో చేసిన యుద్ధం ప్ర‌ధాన అంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. పరిణీతి చోప్రా హీరోయిన్‌గా న‌టించింది. వంద‌కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.200 కోట్ల‌ను వ‌సూలు చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.