కేశినేని వర్సెస్ బుద్దా.. తలలు పట్టుకుంటున్న అధిష్టానం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో నాయకత్వం లోపించిందని స్పష్టం తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారానికి ఎన్నికల ఫలితాలొచ్చిన మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకూ ఫుల్స్టాప్ పడలేదు. సోషల్ మీడియా వేదికగా అటు సొంత పార్టీపై.. ఇటు వైసీపీ కేశినేని చేస్తున్న కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. అయితే రెండ్రోజులుగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్నను టార్గెట్ చేసిన కేశినేని వరుస ట్వీట్లతో రచ్చరచ్చజేస్తున్నారు. మరోవైపు కేశినేని ట్వీట్స్కు అంతేరీతిలో బుద్దా సైతం ట్విట్టర్ వేదికగా కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య రోజురోజుకు ఆరోపణలు శృతి మించిపోతున్నాయి.
ఒకరిపై ఒకరు పరోక్షంగా తీవ్ర విమర్శలు చేసుకుంటుండంతో పార్టీలో అసలేం జరుగుతోందని కార్యకర్తలు, అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కొబ్బరి చిప్పల దొంగ, కాల్మనీ గాడు అంటూ నాని కామెంట్స్ చేయగా.. ఇందుకు బుద్దా స్పందిస్తూ.. ఒకే నెంబర్పై దొంగ పర్మిట్లుతో బస్సులు నడిపిన దొంగ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరోవైపు ఇందుకు కేశినేని రియాక్ట్ అవుతూ టీడీపీ అధినేత చంద్రబాబు పెంపుడు కుక్కను కంట్రోల్ చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ట్విట్టర్ వేదికగా నాయకుల భండారాలు బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇద్దరు నాయకుల తీరుపై టీడీపీ అధిష్టానం తలలు పెట్టుకొంటున్నది. అయితే ఇద్దరూ కీలకనేతలే కావడం.. ఇద్దరిలో ఎవరికీ క్లాస్ తీసుకోవాలో ఏంటో తెలియని పరిస్థితి. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తే సరే లేకుంటే పరిస్థితులు మరింత శృతి మించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు జోక్యం చేసుకుని ఇద్దరి పంచాయితీని సర్ది చెబుతారో లేకుంటే మిన్నకుండిపోతారో తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.