close
Choose your channels

విజయవాడ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

Thursday, July 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజయవాడ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులతో ఉన్న పాత పరిచయాల ఆధారంగా డ్రగ్స్ అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. కాగా.. విజయవాడలో డ్రగ్స్ అమ్ముతూ ఇద్దరు విదేశీయులు పోలీసులకు అడ్డంగా దొరికి పోవడం ఇది రెండో సారి కావడం గమనార్హం. గతంలో ద్వారకా తిరుమల రావు సీపీగా ఉన్నప్పుడు ఇద్దరు విదేశీయులు ఇలాగే పట్టుబడ్డారు. కాగా.. విజయవాడలో డ్రగ్స్ అమ్మకంలో కీలక సూత్రధారిగా వ్యవహరిస్తున్న కోనేరు అర్జున్.. పెనమలూరు పీఎస్ పరిధిలో ఒక కళాశాల లో బీటెక్ చేసినట్టు గుర్తించారు.

పాత పరిచయాలతో పాటు ఇతర కళాశాలల్లోని స్నేహితుల ఆధారంగా ఈ డ్రగ్స్ అమ్మకాలను కొనసాగిస్తున్నట్టు గుర్తించారు. సూడాన్‌ దేశానికి చెందిన మహమ్మద్‌ గహేల్‌ రసూల్‌(25) అలియాస్‌ కబూబ్‌, టాంజానియా దేశానికి చెందిన యోనా లిస్వా షబానీ(26) నుంచి అర్జున్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. అర్జున్‌తో పాటు అతని వద్ద డ్రగ్స్ కొన్నవారిని సైతం విచారించాలని పోలీసులు యోచిస్తున్నారు. విదేశీయుల పాస్‌పోర్టులను రద్దు చేయించడానికి అధికారులతో పోలీసులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

కాగా.. డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను విజయవాడ టాస్క్‌ఫోర్సు పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. వీరి నుంచి 17 గ్రాముల మెథలైన్‌ డయాక్సీ మిథాం ఫేటమిన్‌, 150 గ్రాముల గంజాయి, బిట్‌కాయిన్స్‌, హుక్కా పరికరం, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన ముగ్గురిలో సూడాన్‌ దేశానికి చెందిన మహమ్మద్‌ గహేల్‌ రసూల్‌‌, టాంజానియా దేశానికి చెందిన యోనా లిస్వా షబానీ, కోనేరు అర్జున్ ఉన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.