‘సలార్’ నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది..

  • IndiaGlitz, [Sunday,February 28 2021]

‘కేజీఎఫ్’ చిత్ర యూనిట్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోందంటే దానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.. అదీకాకుండా ఆ చిత్రంలో ‘బాహుబలి’ స్టార్ ప్రభాస్ హీరో అంటే ఉండే క్రేజ్‌ను అంచనా వేయడం కూడా చాలా కష్టం. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘కేజీయఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అందరి ఎదురుచూపులకు తెరదించుతూ చిత్ర యూనిట్ అసలైన, కీలకమైన అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ‘సలార్’ చిత్రం ఏప్రిల్‌ 14, 2022న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘కేజీఎఫ్’ను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ రూపొందిస్తున్న ఈ సినిమా రూ.150కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.

రవి బస్రూర్‌ ‘సలార్‌’కు సంగీతం అందిస్తున్నారు. ‘కేజీయఫ్‌’తో డైరెక్టర్‌గా సత్తా నిరూపించుకున్న ప్రశాంత్‌నీల్‌ సారథ్యంలో ‘బాహుబలి’తో ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ హీరోగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ఇటీవల గోదావరిఖనిలోని బొగ్గుగనుల్లో చిత్రీకరించారు. రాజుకు కుడి భుజంగా ఉండే వ్యక్తిని ‘సలార్‌’ అని అంటారు. సైన్యాధిపతి (కమాండర్‌ ఇన్‌ చీఫ్‌) నుంచి ఆ పదం వచ్చిందని గతంలో ప్రశాంత్ నీల్ వివరించారు.

More News

'హిట్‌2' అనౌన్స్‌ చేసిన నిర్మాత నాని.. హీరో మారుతున్న‌ట్లు హింట్

నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై యువ కథానాయకుడు విష్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం `హిట్‌`.

ప్రియుడితో క‌మ‌ల్‌ను క‌లిసిన శ్రుతిహాసన్‌..!

మొన్న‌టి వ‌ర‌కు మైకేల్‌తో ప్రేమాయణం నెరిపిన శ్రుతిహాస‌న్, ప్రేమ‌లో ఉన్న స‌మ‌యంలో సినిమాల‌కు దూర‌మైంది.

చ‌ర‌ణ్‌, శంక‌ర్ సినిమాకు దిల్‌రాజు కేటాయించిన బ‌డ్జెట్ ఎంతంటే?

స్టార్ డైరెక్ట‌ర్‌తో సినిమా అంటే నిర్మాత‌లకు ముందు ధైర్యం ఉండాల‌నేది ఇండ‌స్ట్రీలో వినిపించే వార్త‌.

ఫ్యాన్సీ రేటుకు ‘వ‌కీల్‌సాబ్’ శాటిలైట్.. డిజిటిల్ హ‌క్కులు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘వ‌కీల్ సాబ్‌’. ప్ర‌ముఖ నిర్మాత బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌,

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం తథ్యం: ప్రశాంత్ కిషోర్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది తొలి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న ఎన్నికలను పీకే ప్రస్తావించారు.