స్కూలు కెళుతున్నట్లుంది అంటున్న ఖుష్బూ

  • IndiaGlitz, [Wednesday,April 12 2017]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ఖుష్బూ సుప‌రిచిత‌మే..కాల‌క్ర‌మేణ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రై గుడి క‌ట్టించుకునే రేంజ్ అభిమానుల‌ను సంపాదించుకుంది. అడ‌పా ద‌డ‌పా తెలుగు సినిమాల్లో న‌టిస్తూనే ఉంది. రీసెంట్‌గా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ సినిమాలో ఖుష్బూ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ పాత్ర కోసం షూటింగ్‌కు వ‌స్తుంటే చిన్నప్పుడు స్కూలుకు వెళుతున్న రోజులు గుర్తుకు వ‌స్తున్నాయి అంటూ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. 2006లో స్టాలిన్‌, 2007లో య‌మ‌దొంగ చిత్రాల్లో న‌టించి ఖుష్బూ చాలా గ్యాప్ త‌ర్వాత న‌టిస్తున్న చిత్ర‌మిది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

More News

ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమైన 'లంక'

టెలిపతీ నేపథ్యంలో రూపొందిన సైంటిఫిక్ థ్రిల్లర్ 'లంక'.సీనియర్ హీరోయిన్ రాశి కీలకపాత్రలో

తమిళ 'క్వీన్' ఆగిపోయింది...

బాలీవుడ్ లో కంగనారనౌత్ ప్రధానపాత్రలో రూపొందిన చిత్రం 'క్వీన్'.

'మిస్టర్' ..నాకు గుర్తుండిపోయే చిత్రం - వరుణ్ తేజ్

వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠి,హెబ్బాపటేల్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీనువైట్ల దర్శకత్వంలో

గోపీచంద్ సాహసం..

సౌఖ్యం తర్వాత గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో జె.భగవాన్,పుల్లారావు నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'గౌతమ్ నంద`

మహేష్ కొత్త వ్యాపారం...

సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు చిత్రంతో ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పెట్టి నిర్మాతగా మారాడు.