చరణ్ కోసం కియారా.. దర్శకుడు గట్టి ప్రయత్నాలు!!

  • IndiaGlitz, [Monday,January 13 2020]

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. నిర్మాత కూడా అయిన చెర్రీ.. నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే ఇద్దరూ కలిసి నటిస్తున్నారా.. లేక చిరు ఫ్లాష్ బ్యాక్‌లో చరణ్ కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోందని టాక్. ఇప్పటికే కొరటాల ఆమెతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇద్దరితో ఒక పాటను షూట్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ప్యాన్ ఇండియా మూవీగా దీన్ని మలుస్తున్న ఈ చిత్ర బృందం.. కియారా నటించడం ద్వారా ఎంతో కొంత ఉపకరిస్తుందని భావిస్తోంది. ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది.

హైద‌రాబాద్ శివారు ప్రాంతాల్లో సైరా న‌ర‌సింహారెడ్డి కోసం వేసిన ఓ సెట్‌లో చిన్న చిన్న మార్పులు చేసిన చిరు 152 సినిమాను చిత్రీక‌రిస్తున్నారు. త్రిష హీరోయిన్‌గా న‌టించ‌నుంది. ఆగ‌స్ట్ 14న ఈ సినిమాను విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

బాలయ్య-బోయపాటి సినిమా నుంచి ప్రముఖ టెక్నీషియన్ ఔట్

బాలయ్య-బోయపాటి సినిమాకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొదట బడ్జెట్ .. ఆ తర్వాత రెమ్యునరేషన్ గొడవ..

‘సరస’ సంభాషణ ఎఫెక్ట్.. చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్‌కు.. మహిళా ఉద్యోగినికి సరస సంభాషణ చేస్తున్నట్లు ఓ ఆడియో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

శర్వానంద్ విడుదల చేసిన P3 పటారుపాలెం ప్రేమ కథ థర్డ్ సాంగ్

జె.ఎస్ ఫిలిమ్స్ పతాకం పై దొరైరాజు వూపాటి  దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం "పటారుపాళెం ప్రేమ కథ" శ్రీ మానస్, సమ్మోహన హీరో హీరోయిన్ లుగా

కనుల పండుగగా జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 ని జరుపుకున్న జీ తెలుగు

నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్ జీ తెలుగు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన జీ తెలుగు… ఇప్పుడు మరోసారి జీ సినీ అవార్డ్స్ తెలుగు 2020 తో

'భీష్మ' టీజర్ విడుదల

నితిన్,రష్మిక మండన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం 'భీష్మ'.