బ్యాడ్మింటన్ లీగ్‌లో కోవిడ్ కలకలం.. కిదాంబి శ్రీకాంత్ సహా ఏడుగురికి పాజిటివ్

  • IndiaGlitz, [Thursday,January 13 2022]

భారత్‌లో కరోనా వైరస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. నిపుణులు చెప్పినదాని కంటే వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 2,47,417 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. మహారాష్ట్రలో అత్యధికంగా 46,723 మంది, ఢిల్లీలో 27,561 మంది కరోనా బారినబారినపడ్డారు. నిన్న కోవిడ్ కారణంగా 380 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వైరస్ బాధితులుగా మారుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ, క్రీడా, రాజకీయ తదితర రంగాల ప్రముఖులకు పాజిటివ్‌గా తేలింది. ముఖ్యంగా సినీ పరిశ్రమ కరోనాకు హాట్ స్పాట్‌గా మారినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా ఈ లిస్ట్‌లో క్రీడాకారులు చేరుతున్నారు. ఇటీవల ప్రారంభమైన ఇండియా ఓపెన్‌లో మొత్తం ఏడుగురు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌, అశ్విని పొన్నప్ప, రితికా రాహుల్‌ థక్కర్, ట్రెస్సా జోలీ, మిథున్‌ మంజునాథ్‌, సిమ్రన్‌ అమాన్‌ సింఘీ, కుషి గుప్తా ఉన్నారు. వీరికి కోవిడ్ సోకిన నేపథ్యంలో క్రీడాకారుల డబుల్స్‌ పార్ట్‌నర్స్‌ సైతం టోర్నీ నుంచి తప్పుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ వెల్లడించింది.

ఈ క్రమంలోనే మెయిన్ డ్రాలో పాల్గొనని ఆటగాళ్లకు బదులుగా వేరేవారిని మార్చే ప్రసక్తి లేదని, దీంతో వారి ప్రత్యర్థులను నేరుగా తదుపరి రౌండ్లకు ప్రమోట్‌ చేస్తామని బీడబ్ల్యూఎఫ్‌ పేర్కొంది. ఈ విషయాన్ని బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ) ధ్రువీకరించింది. కాగా, జనవరి 11న మొదలైన ఈ ఇండియా ఓపెన్‌ టోర్నీలో గురువారం రెండో దశ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీని రద్దు చేస్తారా లేక అలాగే కొనసాగిస్తారా అన్నది తేలాల్సి వుంది.

More News

ఆర్ఆర్ఆర్ రిలీజ్ కాకపోయినా మాకేం బాధలేదు.. కానీ : రామ్‌చరణ్ హాట్ కామెంట్స్

బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘‘ఆర్ఆర్ఆర్’’.

అల వైకుంఠపురానికి రెండేళ్లు : ఒక్క హిట్టు.. ‘‘పూజా’’ని స్టార్ హీరోయిన్‌ని చేసింది

కొన్ని సినిమాలు కొందరి కోసమే పుడతాయి. అవి కూడా చరిత్రను తిరగరాసేవిగానో, ఎదుగుబొదుగు లేని జీవితానికి మంచి బూస్ట్ ఇచ్చేలాంటివో అవుతాయి.

మహమ్మారి కమ్ముకొస్తుంటే.. కొవిడ్‌ నిబంధనలు గాలికి, 1500 మంది కలిసి కోతి అంత్యక్రియలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 విశ్వరూపం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ భారీ స్థాయిలో కేసులతో యూరప్, అమెరికా, ఆఫ్రికా ఖండాలు వణికిపోతున్నాయి.

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు దుర్మరణం, మృతులు వైసీపీ ఎమ్మెల్యే బంధువులు

గుంటూరు జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో తల్లికూతుళ్లు కాలువలో గల్లంతయ్యారు. వీరు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయ్ కుమారుడి భార్యాపిల్లలు.

అసలే చలితో గజగజ... తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, అక్కడక్కడా వడగండ్ల వానలు

అసలే చలితో వణుకుతుంటే.. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేదు వార్త చెప్పింది. నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని..