మార్చి 2 నుండి కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జవాల్కర్ ల చిత్రం షూటింగ్ ప్రారంభం

  • IndiaGlitz, [Thursday,February 27 2020]

త‌న‌దైన శైలిలో రాజా వారి రాణి గారు చిత్రంలో న‌టించి మెప్పించిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా త‌న రెండ‌వ చిత్రం ఎలైట్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో పూజాకార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటంగ్ ని మార్చి 2 నుండి ప్రారంభిస్తున్నారు. టాక్సీవాలా లాంటి సూప‌ర్‌హిట్ చిత్రం లో న‌టించి యువ‌త మ‌న‌సులు గెలుచుకున్న ప్రియాంక జవాల్కర్ కిర‌ణ్ కి జోడిగా న‌టిస్తుంది.

ఈ చిత్రానికి ఆర్ ఎక్స్ 100 మ్యూజిక్ ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ మంచి సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీధ‌ర్ గ‌డె ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతున్నాడు. అతి ముఖ్య‌మైన పాత్ర లో సాయికుమార్ న‌టిస్తున్నారు. రాజావారి రాణిగారు చిత్రం ద్వారా ప‌రిచ‌య‌మైన కిర‌ణ్ ప‌ల్లెటూరి ప్రేమికుడిగా క‌నిపించాడు. ఇప్ప‌డు ఈ చిత్రం కొసం త‌న‌ని తాను మ‌రో కొత్త కొణం లో చూపించ‌టానికి స్టైలింగ్ మార్చుకున్నాడు. ఈ చిత్రం అంద‌రిని అల‌రించేలా వుంటుంద‌ని నిర్మాత‌లు తెలిపారు..

న‌టిన‌టులు.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జవాల్కర్ , సాయికుమార్ త‌దిత‌రులు న‌టించ‌గా..

More News

2024 కల్లా పవన్ టార్గెట్ రూ. 500 కోట్లు..!

అవును మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ రూ. 500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

‘పింక్’ రీమేక్ : ట్రెండ్ సెట్ చేస్తున్న థమన్!

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నెల 29 న వైజాగ్ లో 'భీష్మ'  విజయోత్సవ వేడుక

ప్రముఖ హీరో నితిన్ టైటిల్ రోల్ పోషించిన 'భీష్మ' మూవీ ఫిబ్రవరి 21న విడుదలై ఘన విజయం సాధించింది.

చిరంజీవి యువత నుంచి బండ్రెడ్డు ఔట్

ఇంటి దొంగలను పనిపట్టే పనిలో జనసేన సిద్ధమవుతోందని.. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలపాలు సాగించినా లీగల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని

ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసేందుకు త్రినయని సీరియల్‌తో మీ ముందుకు వస్తోన్న జీ తెలుగు

అద్భుతమైన కథలు, అత్యద్భుతమైన సీరియల్స్‌, అంతకుమించిన రియాలిటీ షోస్‌తో తెలుగు ప్రేక్షకుల్ని జీ తెలుగు నాన్‌స్టాప్‌గా ఎంటర్‌టైన్‌ చేస్తోంది.