కిట్టుగాడి విజయ యాత్ర

  • IndiaGlitz, [Thursday,March 09 2017]

వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ హీరోగా, అను ఇమ్మాన్యుయ‌ల్ హీరోయిన్‌గా ఏటీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌'. మార్చి 3న విడుద‌లైన ఈ చిత్రం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తొలి ఆట నుండి హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వ‌సూళ్ళ‌ను రాబ‌ట్టుకుంది.

అను ఇమ్మాన్యుయ‌ల్ గ్లామ‌ర్‌, రేచీగా పృథ్వీ హిలేరియ‌స్ పెర్‌ఫార్మెన్స్‌, ర‌ఘుబాబు, వెన్నెల‌కిషోర్‌, సుద‌ర్శ‌న్‌, ప్ర‌వీణ్ కామెడి స‌హా అనూప్ మ్యూజిక్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. వంశీకృష్ణ టేకింగ్, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ మేకింగ్ వాల్యూస్‌తో రాజ్ త‌రుణ్ కెరీర్‌లోనే పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ చిత్రంగా నిలిచిన కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త సినిమాకు ఇంతటి విజ‌యాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌ను ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకుని, వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయ‌డానికి యూనిట్ అంతా సిద్ధ‌మైంది. అందులో భాగంగా మార్చి 10 నుండి విజ‌య యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. మార్చి 10న వైజాగ్‌, కాకినాడ, మార్చి 11న రాజమండ్రి, ఏలూరు, మార్చి 12న గుంటూరు, విజ‌యవాడ‌ల్లో చిత్ర యూనిట్ స‌క్సెస్‌టూర్‌లో భాగంగా అక్క‌డి థియేట‌ర్స్‌కు వెళ్ళి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్స్‌లో ప‌ల‌క‌రించ‌నున్నారు.

More News

జాహ్నవి ఫిలింస్ బ్యానర్ లో అల్లరి నరేష్ కొత్త చిత్రం

మలయాళం లో ఘన విజయం సాధించిన 'ఓరు వడక్కన్ సెల్ఫీ' చిత్రం అల్లరి నరేష్ హీరోగా తెలుగులో రీమేక్ కాబోతుంది. జాహ్నవి ఫిలింస్ బ్యానర్పై శ్రీమతి నీలిమ సమర్పణలో చంద్రశేఖర్ బొప్పన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. 'ఓరు వడక్కన్ సెల్ఫీ' మలయాళ మాతృక చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జి. ప్రజీత్ ఈ రీమేక్కి దర్శకత్వం వహించనున్నారు.

రాజశేఖర్ కుమార్తెను పరిచయం చేయనున్న దర్శకుడు

చిత్రం, జయం, నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు తేజ ఇప్పుడు రానా, కాజల్ హీరో హీరోయిన్లుగా ఓ పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ప్రారంభం

బాలకృష్ణ, పూరి జగన్నాథ్ అంటేనే క్రేజీ కాంబినేషన్. హీరోయిజంను డిఫరెంట్ స్టయిల్లో ప్రెజెంట్ చేసే దర్శకుడు పూరి, వంద చిత్రాలతో తెలుగు సినిమా రంగంలో తండ్రికి తగ్గ తనయుడుగా రాణిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా గురువారం ఉదయం ప్రారంభమైంది.

రాంగోపాల్ వర్మపై గోవాలో కేసు...

ఉమెన్స్డే సందర్భంగా శుభాకాంక్షలు చెబితే ఎవరిపై అయిన కేసు పెడతారా..కానీ కేసు పెట్టారు. ఇంతకు కేసు పెట్టిన వ్యక్తి గోవా హిందు జాగృతి సంస్థకు చెందిన కరగోన్కర్. మరి ఇంతకు కేసు ఎవరుపై పెట్టారో తెలుసా..రాంగోపాల్ వర్మపై.

'మిస్టర్' రిలీజ్ డేట్

ముకుంద, లోఫర్ చిత్రాల తర్వాత మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మిస్టర్`. లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ హీరోయిన్స్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.