'పంతం' బయ్యర్ల సంతోషం నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది: కె.కె.రాధామోహన్‌

  • IndiaGlitz, [Saturday,July 28 2018]

''అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్‌ టైగర్‌' వంటి మంచి హిట్‌ చిత్రాల తర్వాత మా శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ బేనర్‌లో యాక్షన్‌ హీరో గోపీచంద్‌తో చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన 'పంతం' అన్ని సెంటర్స్‌లో దిగ్విజయంగా 25 రోజులు పూర్తి చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

మా చిత్రం చూసి ప్రేక్షకులు చాలా మంది యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ ఇచ్చిన సినిమా 'పంతం' చాలా బాగుందని అభినందించడం ఆనందాన్ని కలిగించింది. అలాగే మా చిత్రం కొన్న బయ్యర్లందరూ తమకు కమర్షియల్‌గా ఈ సినిమా చాలా హ్యాపీ ప్రాజెక్ట్‌ అయిందని చెప్పడం నిర్మాతగా నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది.

'పంతం'లాంటి మంచి సినిమా చేసి విజయం సాధించినందుకు ఎంతో సంతోషంగా వుంది. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను'' అన్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ అధినేత, సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్‌ 'పంతం' విజయంపై స్పందిస్తూ.

More News

తెలుగు ఫిలించాంబ‌ర్ నూత‌న‌ అధ్య‌క్షుడిగా విశాఖ వాసి

తెలుగు ఫిలించాంబ‌ర్ నూత‌న‌ అధ్య‌క్షుడిగా విశాఖ వాసి, పూర్వి పిక్చ‌ర్స్ అధినేత‌ వి.వీరినాయుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.

అక్షరం ఆడియో విడుదల

పిఎల్ క్రియెషన్స్, ఆకుల రాజయ్య ప్రెసెంట్స్, జాకీ తోట దర్శకత్వంలో ప్రాసాద్ నల్లపాట, లోహిత్ కుమార్ నిర్మాతలు. హైదరాబాద్ ఫిలీంనగర్ ఎఫ్ఎన్ సీసీ లో ఏర్పాటు చేసిన ఆడియో లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల

ఆగష్టు 3న జ్యోతిక ఝాన్సీ విడుదల

తమిళం లో విడుదలై భారీ విజయం సాధించిన నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరు తో విడుదలకు సిద్ధంగా ఉంది అని మన్నందరికి తెలుసు.

జులై 31న మెద‌టి సింగిల్ కి రెడి అవుతున్న ఐరా క్రియేష‌న్స్‌ @న‌ర్త‌న‌శాల

ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల మెద‌టి లుక్ ని విడుద‌ల‌ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు.

ఫిలించాంబ‌ర్‌ కొత్త అధ్య‌క్షుడు - పూర్వి పిక్చ‌ర్స్ వీరినాయుడు

తెలుగు ఫిలించాంబ‌ర్ నూత‌న‌ అధ్య‌క్షుడిగా విశాఖ వాసి, పూర్వి పిక్చ‌ర్స్ అధినేత‌ వి.వీరినాయుడు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు.