close
Choose your channels

‘ఆచార్య’లో విలన్ ఎవరంటే..?

Tuesday, November 24, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘ఆచార్య’లో విలన్ ఎవరంటే..?

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది. తాజాగా ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య‌’తో అయినా 2020లో బాక్సాఫీస్ వ్ద‌ద సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌ని మెగాస్టార్ భావించారు. కానీ క‌రోనా వైర‌స్ మెగా స్పీడుకి బ్రేకులేసింది. ‘ఆచార్య‌’ విడుద‌ల ఈ ఏడాది లేదు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయాలని చూస్తున్నారు. లాక్డౌన్ తర్వాత సినిమా షూటింగ్ పునః ప్రారంభ‌మైంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో విల‌న్‌గా కోలీవుడ్ యాక్ట‌ర్ అర‌‌వింద‌స్వామి క‌నిపించ‌నున్నాడ‌ట‌. స్క్రిప్ట్ కూడా నెరేష‌న్ జ‌రిగింద‌ని, న‌చ్చ‌డంతో అర‌వింద‌స్వామి ఓకే చెప్పార‌ని టాక్.

ఇది వ‌ర‌కు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ ధృవ చిత్రంలో స్టైలిష్ విల‌న్‌గా మెప్పించిన అర‌వింద‌స్వామి, ఈసారి తండ్రి మెగాస్టార్ చిరంజీవిని ఢీ కొట్ట‌నున్నాడు. ఇందులో అర‌వింద‌స్వామి పాత్ర ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి రేపుతోంది. త్వ‌ర‌లోనే కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా యూనిట్‌తో జాయిన్ కానుంది. రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌క్సలైట్ నాయ‌కుడిగా కనిపించ‌నున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్‌తో మ్యాట్నీఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.