‘ఆచార్య’లో విలన్ ఎవరంటే..?

గ‌త ఏడాది ‘సైరా న‌ర‌సింహారెడ్డి’తో మెగాభిమానుల‌ను అల‌రించాల‌ని అనుకున్న మెగాస్టార్ చిరంజీవికి అంత స్కోప్ లేకుండా పోయింది. తాజాగా ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య‌’తో అయినా 2020లో బాక్సాఫీస్ వ్ద‌ద సెన్సేష‌న్ క్రియేట్ చేయాల‌ని మెగాస్టార్ భావించారు. కానీ క‌రోనా వైర‌స్ మెగా స్పీడుకి బ్రేకులేసింది. ‘ఆచార్య‌’ విడుద‌ల ఈ ఏడాది లేదు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయాలని చూస్తున్నారు. లాక్డౌన్ తర్వాత సినిమా షూటింగ్ పునః ప్రారంభ‌మైంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో విల‌న్‌గా కోలీవుడ్ యాక్ట‌ర్ అర‌‌వింద‌స్వామి క‌నిపించ‌నున్నాడ‌ట‌. స్క్రిప్ట్ కూడా నెరేష‌న్ జ‌రిగింద‌ని, న‌చ్చ‌డంతో అర‌వింద‌స్వామి ఓకే చెప్పార‌ని టాక్.

ఇది వ‌ర‌కు త‌న‌యుడు రామ్‌చ‌ర‌ణ్ ధృవ చిత్రంలో స్టైలిష్ విల‌న్‌గా మెప్పించిన అర‌వింద‌స్వామి, ఈసారి తండ్రి మెగాస్టార్ చిరంజీవిని ఢీ కొట్ట‌నున్నాడు. ఇందులో అర‌వింద‌స్వామి పాత్ర ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి రేపుతోంది. త్వ‌ర‌లోనే కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా యూనిట్‌తో జాయిన్ కానుంది. రామ్‌చ‌ర‌ణ్ కూడా న‌క్సలైట్ నాయ‌కుడిగా కనిపించ‌నున్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్‌తో మ్యాట్నీఎంట‌ర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

More News

తీవ్ర తుపాను‌గా మారిన వాయుగుండం

వాయుగుండం తీవ్ర తుపాను‌గా మారింది. ఈ తుపానుకు నివర్ అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే.

ఏపీపై కేటీఆర్ కామెంట్.. ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ బీజేపీ నేత ఫైర్

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.

బాలీవుడ్ స్టార్ట్స్‌ని వెనక్కి నెట్టేసిన సోనూసూద్..

సోనూ సూద్ రీల్ విలన్ కాస్తా.. కరోనా మహమ్మారి దేశంలోకి ఎంటర్ అవగానే రియల్ హీరోగా మారిపోయిన విషయం తెలిసిందే.

షూటింగ్‌కి సడెన్‌గా ప్యాకప్ చెప్పి వెళ్లిపోయిన శ్రుతిహాసన్..

అగ్ర‌హీరో క‌మ‌ల్‌హాస‌న్ కుమార్తెగా వెండితెర‌కు ప‌రిచ‌యమైనప్పటికీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి నటిగా శ్రుతిహాసన్ సొంత గుర్తింపును సంపాదించుకోగలిగింది.

పర్మిషన్ వచ్చేసింది... తెర తొలిగేదెప్పుడు?

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు మార్చి 15 నుంచి మూత పడ్డాయి.